తెలంగాణ

telangana

Gold Rate Today : జీవితకాల గరిష్ఠానికి బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

By

Published : May 4, 2023, 6:25 PM IST

Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. దిల్లీలో జీవితకాల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి.

GOLD PRICE IN HYDERABAD AND VIJAYAWADA
GOLD PRICE IN HYDERABAD AND VIJAYAWADA

Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. దిల్లీలో పది గ్రాముల బంగారం ధర రూ.940 పెరిగి.. ప్రస్తుతం రూ.62,020కి చేరుకుంది. ఇది జీవితకాల గరిష్ఠ స్థాయి. మరోవైపు, కిలో వెండి ధర రూ.660 పెరిగి.. ప్రస్తుతం రూ.76,700 వద్ద కొనసాగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

  • Gold price in Hyderabad : హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.62,020 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.76,700 రూపాయలుగా ఉంది.
  • Gold price in Vijayawada : విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.62,020గా ఉంది. కిలో వెండి ధర రూ.76,700 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vishakhapatnam : వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.62,020 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.76,700గా ఉంది.
  • Gold price in Proddatur : ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.62,020గా ఉంది. కేజీ వెండి ధర రూ.76,700 వద్ద ఉంది.

బంగారం ధర పెరిగే ఛాన్స్​!
అమెరికా ఫెడరల్ రిజర్వ్​ వడ్డీ రేటు పెంపును నిలిపివేస్తుందనే సూచనలతో డాలర్​ విలువ క్షీణించింది. దీంతో గురువారం ప్రపంచవ్యాప్తంగా బంగారం ధర రికార్డు స్థాయికి చేరుకుంది. భారతీయులు ఎక్కువగా పెట్టుబడి పెట్టే వాటిలో బంగారం ముఖ్యమైనది. అలంకరణతో పాటు ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని నిలబడడం వల్ల ప్రజలు ఎక్కువగా పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తారు. గత ఏడాది కాలంగా చూస్తే బంగారం ధర పెరుగుతూ వస్తోంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్ల పెంపుదల కొనసాగితే బంగారం ధరపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని బంగారంపై స్వల్పకాలిక పెట్టుబడి కన్నా దీర్ఘకాల పరిమితిలో మెరుగైన ఫలితాలు రావచ్చని అంచనా వేస్తున్నారు.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 2,041 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 25.28 డాలర్ల వద్ద ఉంది.

పెట్రోల్ ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64 ఉంది. డీజిల్ ధర 97.80 రూపాయలుగా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర .96.72 రూపాయలుగా ఉంటే.. డీజిల్ ధర రూ.89.62గా ఉంది.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ ధర రూ.23,84,158 పలుకుతోంది. ఇథీరియం, బైనాన్స్​ కాయిన్​, క్రిప్టోకరెన్సీలతో.. పాటుగా మిగతా వాటి ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్​ రూ.23,84,158
ఇథీరియం రూ.1,55,746
టెథర్​ రూ.81.78
బైనాన్స్​ కాయిన్​ రూ.26,650
యూఎస్​డీ కాయిన్ రూ.81.75

ABOUT THE AUTHOR

...view details