తెలంగాణ

telangana

స్థిరంగా బంగారం.. స్వల్పంగా పెరిగిన వెండి.. ప్రస్తుత ధరలివే

By

Published : Aug 8, 2022, 11:02 AM IST

Gold Price Today: దేశంలో బంగారం ధర స్థిరంగా ఉంది. వెండి ధర స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఎంత ఉన్నాయంటే?

GOLD PRICE
GOLD PRICE

Gold Price Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర స్థిరంగా ఉంది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం రూ.53 వేలకు పైగా పలుకుతోంది. మరోవైపు, వెండి ధర స్వల్పంగా పెరిగింది. కేజీ వెండి రూ.200 మేర ప్రియమైంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.53,680గా ఉంది. కిలో వెండి ధర రూ.58,990 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.53,680 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.58,990గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,680గా ఉంది. కేజీ వెండి ధర రూ.58,990వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.53,680గా ఉంది. కేజీ వెండి ధర రూ.58,990 వద్ద కొనసాగుతోంది.
  • స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..: అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,773.85 డాలర్లు పలుకుతోంది. ఔన్సు వెండి ధర 19.95 డాలర్లుగా ఉంది

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు:
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీ:
బిట్​కాయిన్ విలువ స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.19,38,000 పలుకుతోంది. ఇథీరియం రూ.385 పైగా పెరిగింది. ప్రస్తుతం రూ.1,42,487 వద్ద కొనసాగుతోంది.

క్రిప్టోకరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.19,38,000
ఇథీరియం రూ.1,42,487
టెథర్ రూ.83.62
బినాన్స్​ కాయిన్ రూ.25,613
యూఎస్​డీ కాయిన్ రూ.84.24

స్టాక్ మార్కెట్లు
ఆరంభంలో స్వల్ప నష్టాలతో ట్రేడింగ్‌ మొదలుపెట్టిన స్టాక్ మార్కెట్ సూచీలు తర్వాత కాస్త కోలుకొని లాభాల దిశగా పయనిస్తున్నాయి. సెన్సెక్స్‌ 300 పాయింట్లకు పైగా లాభంతో 58,700 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 77 పాయింట్లు లాభపడి 17,475 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఎంఅండ్‌ఎం, మారుతీ, రిలయన్స్‌, పవర్‌గ్రిడ్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టైటన్‌, ఎల్‌అండ్‌టీ, డాక్టర్‌ రెడ్డీస్‌, భారతీ ఎయిర్‌టెల్‌, టాటా స్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, నెస్లే ఇండియా, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

రూపాయి
మరోవైపు రూపాయి పతనం కొనసాగుతోంది. సోమవారం రూపాయి విలువ 22 పైసలు పతనమైంది. ప్రస్తుతం డాలరుతో పోలిస్తే రూపాయి.. 79.46 వద్ద ట్రేడవుతోంది.

ABOUT THE AUTHOR

...view details