తెలంగాణ

telangana

పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

By

Published : Jun 6, 2022, 10:48 AM IST

Gold Price Today: బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 గ్రాముల పసిడి ధర రూ. 52,850గా ఉండగా.. కిలో వెండి ధర రూ. 64,300గా ఉంది.

gold-price-today
gold-price-today

Gold Price Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర ఆదివారంతో పోలిస్తే రూ.100కుపైగా పెరిగింది. ప్రస్తుతం రూ.52,850 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.700పైగా పెరిగింది. ప్రస్తుతం రూ.64,300కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం..

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.52,850గా ఉంది. కిలో వెండి ధర రూ.64,300 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,850 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.64,300గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,850గా ఉంది. కేజీ వెండి ధర రూ. 64,300 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,850గా ఉంది. కేజీ వెండి ధర రూ.64,300 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..అంతర్జాతీయంగా స్పాట్​ గోల్డ్​ ధర కూడా స్వల్పంగా పెరిగింది. ఔన్సు బంగారం 1857 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర.. ఔన్సుకు 22.30 డాలర్లుగా ఉంది.
ఇంధన ధరలు ఇలా..పెట్రోల్, డీజిల్ ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

Cryptocurrency Price in India: క్రిప్టోకరెన్సీల్లో.. బిట్​కాయిన్​ విలువ పెరిగింది. ప్రస్తుతం రూ. 25,47,446 వద్ద ఉంది. ఇథీరియం, బినాన్స్​ కాయిన్​ మొదలైన ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల ధరలు ఎలా ఉన్నాయంటే..

క్రిప్టోకరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.25,47,446
ఇథీరియం రూ.1,53,562
టెథర్ రూ.81.70
బినాన్స్​ కాయిన్ రూ.25,105
యూఎస్​డీ కాయిన్ రూ.81.84

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు:దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 260 పాయింట్లు కోల్పోయి.. 55 వేల 500 వద్ద ఉంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 70 పాయింట్లు కోల్పోయి 16 వేల 510 వద్ద కొనసాగుతోంది. ఎన్టీపీసీ, టాటాస్టీల్​, సన్​ఫార్మా, యాక్సిస్​ బ్యాక్​​ రాణిస్తున్నాయి. మారుతీ, కొటాక్​ బ్యాంక్​, ఐటీసీ, రిలయన్స్​​ డీలాపడ్డాయి.

ఇవీ చదవండి:తొలి జీతం అందుకున్నారా? మరి వీటిని పాటిస్తున్నారా.. లేదా?

సంపాదన మొత్తం ఈఎంఐలకే పోతుందా? ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి..!

ABOUT THE AUTHOR

...view details