తెలంగాణ

telangana

వరుస లాభాలకు బ్రేక్.. సెన్సెక్స్​ 770 మైనస్

By

Published : Feb 3, 2022, 3:49 PM IST

Stock Market Close: స్టాక్​ మార్కెట్లు గురువారం భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 770 పాయింట్లు కోల్పోయి 58,788 వద్దకు దిగజారింది. నిఫ్టీ 219 పాయింట్లు క్షీణించి 17,560 పాయింట్ల వద్ద స్థిరపడింది.

STOCKS
స్టాక్ మార్కెట్లు

వరుసగా రెండు రోజుల లాభాల తర్వాత గురువారం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 770 పాయింట్లు కోల్పోయి 58,788 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 219 పాయింట్లు క్షీణించి.. 17,560 వద్ద సెషన్​ను ముగించింది.

ఇంట్రాడే సాగిందిలా..

బడ్జెట్ సానుకూల ప్రభావంతో వరుసగా రెండురోజులు లాభాలను ఆర్జించిన స్టాక్​ మార్కెట్లు గురువారం సెషన్​లో ఏమాత్రం జోరు ప్రదర్శించలేదు. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ ఉదయం 59,528 పాయింట్ల వద్ద స్వల్ప నష్టాలతో ప్రారంభమైంది. ఆ తర్వాత మిడ్ సెషన్ వరకు ఒడుదొడుకులతో కొనసాగింది. 58,653 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 770 పాయింట్లు కోల్పోయి 58,788 వద్ద స్థిరపడింది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 17,767 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైంది. ఆ తర్వాత 17,781 వద్ద గరిష్ఠస్థాయికి చేరుకుంది. 17,511 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత 219 పాయింట్లు క్షీణించి.. 17,560 వద్ద సెషన్​ను ముగించింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

  • సెన్సెక్స్ 30 షేర్లలో మారుతీ, టైటాన్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంకు షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • సన్​ఫార్మా, ఎన్​టీపీసీ, టీసీఎస్, అల్ట్రాసెమ్​కో, ఎస్​బీఐఎన్​, ఐసీఐసీఐ, భారతీ ఎయిర్​టెల్, నెస్లే ఇండియా, ఎల్​టీ, హిందుస్థాన్ యూనిలీవర్, ఎల్ అండ్ ​టీ, డాక్టర్ ​రెడ్డీస్ షేర్లు నష్టపోయాయి.

ABOUT THE AUTHOR

...view details