తెలంగాణ

telangana

Stock Market: రెండోరోజూ లాభాల్లో ముగిసిన మార్కెట్లు..సెన్సెక్స్​ 600 ప్లస్​

By

Published : Dec 22, 2021, 9:21 AM IST

Updated : Dec 22, 2021, 4:01 PM IST

stock markets
stock markets

15:58 December 22

భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు- సెన్సెక్స్​ 600 ప్లస్​

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలకు తోడు, దేశీయంగా ఆటో, మెటల్​, బ్యాంకు రంగాలు పుంజుకోవటం వల్ల దేశీయ మార్కెట్లు రెండోరోజూ భారీ లాభాల్లో ముగిశాయి. మంగళవారం 497 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్​.. సెన్సెక్స్​ 611 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 16,900పైన స్థిరపడింది.

ముంబాయి స్టాక్ట్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​.. క్రితం ముగింపు కంటే 280 పాయింట్ల ఎగువన...56, 599 పాయింట్ల వద్ద ప్రారంభమై ఆద్యంతం అదే జోరు కనబరిచింది. చివరకు 611 పాయింట్ల లాభంతో 56,930 వద్ద స్థిరపడింది.

జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ.. 184 పాయింట్లు లాభపడి 16,955 పాయింట్ల వద్ద ముగిసింది.

లాభనష్టాల్లోనివి..

  • హిందల్కో, టాటా మోటార్స్​, దివిస్​ ల్యాబ్స్​, బజాజ్​ ఫైనాన్స్​, ఐచర్​ మోటార్స్​లు 2 శాతానికిపైగా లాభ పడ్డాయి.
  • పవర్​ గ్రిడ్​ కార్పొరేషన్​, ఎస్​బీఐ లైఫ్​ ఇన్​స్యూరెన్స్​, విప్రో, ఐఓసీ, అదానీ పోర్ట్​లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

11:46 December 22

Stock Market Live Updates: అంతర్జాతీయ సానుకూల పవనాలతో లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు అదే జోరును కొనసాగిస్తున్నాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 336 పాయింట్లు పెరిగి 56,655 వద్ద కొనసాగుతోంది. మరో సూచీ నిఫ్టీ 109 పాయింట్ల లాభంతో 16,880 వద్ద ట్రేడవుతోంది.

ఒమిక్రాన్‌ విషయంలో ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్న నేపథ్యంలో విదేశీ మదుపరులు కొనుగోలుకు మొగ్గు చూపిస్తున్నారు. మరోవైపు అమెరికాలో లాక్‌డౌన్‌లు ఉండబోవని అధ్యక్షుడు జో బైడెన్‌ తేల్చి చెప్పడం కూడా సానుకూల అంశంగా మదుపర్ల సెంటిమెంట్​ను బలపరిచింది. దీంతో సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి.

ఆర్థిక, లోహ, ఫార్మా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి

లాభనష్టాలు..

బజాజ్​ ఫినాన్స్​, సన్​ఫార్మా, టాటా స్టీల్​, ఇండస్​ ఇండ్​ బ్యాంక్​, భారతీ ఎయిర్​టెల్​ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

విప్రో, హెచ్​డీఎఫ్​సీ, ఐటీసీ, నెస్లే షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

09:18 December 22

స్టాక్ మార్కెట్​ లైవ్​ అప్​డేట్స్

stock market live updates: స్టాక్​మార్కెట్లు బుధవారం సెషన్​ను లాభాలతో ప్రారంభించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్ 392 పాయింట్లు లాభపడి 56,711 వద్ద కొనసాగుతుంది. మరో సూచీ నిఫ్టీ 107 పాయింట్లకు పైగా వృద్ధి చెంది 16,878 వద్ద ట్రేడవుతోంది.

లాభనష్టాలు..

ఇండస్​ ఇండ్​ బ్యాంక్​, రిలయన్స్​, ఎస్​బీఐ, ఎం అండ్​ ఎం, భారతీఎయిర్​ టెల్​, బజాజ్​ ఫిన్​సర్వ్​, టాటా స్టీల్​, మారుతీ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

విప్రో, పవర్​ గ్రిడ్​, డాక్టర్​ రెడ్డీస్​ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Last Updated :Dec 22, 2021, 4:01 PM IST

ABOUT THE AUTHOR

...view details