స్టాక్ మార్కెట్లు (Stock Market) గురువారం భారీ లాభాలతో ముగిశాయి. బుల్ దూకుడుతో బీఎస్ఈ-సెన్సెక్స్ (Sensex today) 418 పాయింట్లు పెరిగి నూతన గరిష్ఠమైన 59,141వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ (Nifty today) 110 పాయింట్ల లాభంతో జీవనకాల గరిష్ఠమైన 17,629 వద్దకు చేరింది.
టెలికాం, వాహన రంగాలకు ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలు ప్రకటించడం సానుకూలతలు (Stock Market) పెంచింది. బ్యాంకింగ్, వాహన, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్లు దూకుడు ప్రదర్శించాయి. ఫలితంగా సూచీలు ఈ స్థాయి రికార్డులను సాధించాయి.
ఇంట్రాడే సాగిందిలా (Intraday)..
సెన్సెక్స్ 59,204 పాయింట్ల అత్యధిక స్థాయి(జీవనకాల గరిష్ఠం), 58,700 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 17,637 పాయింట్ల గరిష్ఠ స్థాయి(కొత్త రికార్డు), 17,510 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.