తెలంగాణ

telangana

Stock Market: వారాంతంలోనూ నష్టాలు- 58,800 దిగువకు సెన్సెక్స్​

By

Published : Oct 1, 2021, 3:45 PM IST

స్టాక్ మార్కెట్లు (Stock Market) వరుసగా నాలుగో రోజూ నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ (Sensex Today) 361 పాయింట్లు తగ్గి 58,800 దిగువకు చేరింది. నిఫ్టీ (Nifty Today) 86 పాయింట్ల నష్టంతో 17,600 మార్క్​ కోల్పోయింది.

Stocks close with loses
స్టాక్ మార్కెట్లకు నష్టాలు

స్టాక్ మార్కెట్లు (Stock Market) వారాంతాన్ని నష్టాలతో ముగించాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ (Sensex today) 361 పాయింట్లు కోల్పోయి 58,765 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 86 పాయింట్ల నష్టంతో 17,532 వద్దకు చేరింది. మార్కెట్లు నష్టాలతో ముగియటం వరుసగా ఇది నాలుగో సెషన్(Stock Market Today)​.

అంతర్జాతీయ మిశ్రమ సంకేతాలు నష్టాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఆర్థిక, ఐటీ, టెలికాం షేర్లు ప్రధానంగా నష్టాల్లో ఉన్నాయి.

ఇంట్రాడే సాగిందిలా (Intraday)..

సెన్సెక్స్(Stock Market) 58,890 పాయింట్ల అత్యధిక స్థాయి, 58,551 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 17,557 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 17,452 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

ఎం&ఎం, డాక్టర్ రెడ్డీస్​, అల్ట్రాటెక్ సిమెంట్, పవర్​గ్రిడ్​, సన్​ఫార్మా షేర్లు లాభాలను గడించాయి.

బజాజ్ ఫినాన్స్​, మారుతీ సుజుకీ, ఏషియన్​ పెయింట్స్​, బజాజ్ ఫినాన్స్, భారతీ ఎయిర్​టెల్ ప్రధానంగా నష్టపోయాయి.

ఇతర మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో.. నిక్కీ (జపాన్​), కోస్పీ (దక్షిణ కొరియా) సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఇదీ చదవండి:వినియోదారులకు షాక్​- భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర

ABOUT THE AUTHOR

...view details