తెలంగాణ

telangana

స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. పది గ్రాములు ఎంతంటే?

By

Published : Jan 21, 2022, 12:07 PM IST

Gold Price Today: దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. వెండి ధర సైతం మోస్తరుగా పెరిగింది. ఇంధన ధరల్లోనూ ఏ మార్పూ లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

GOLD PRICE TODAY
GOLD PRICE TODAY

Gold Price Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర.. రూ.180 మేర పెరిగింది. వెండి ధర రూ.780 అధికమైంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.50,300గా ఉంది. కిలో వెండి ధర రూ.66,900 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.50,300 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.66,900గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.50,300గా ఉంది. కేజీ వెండి ధర రూ.66,900 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.50,300గా ఉంది. కేజీ వెండి ధర రూ.66,900 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..

అంతర్జాతీయంగా బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ఒక డాలరు మేర అధికంగా ట్రేడవుతోంది. ప్రస్తుతం ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,841 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర ఔన్సుకు 24.51 డాలర్లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు

జాతీయ స్థాయిలో ఇంధన ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. దీంతో ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి.

  • Petrol Price Hyderabad: హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.18గా ఉంది. లీటరు డీజిల్ ధర రూ.94.61 వద్ద ఉంది.
  • Petrol Price Vizag: వైజాగ్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.03వద్ద కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.95.17వద్ద ఉంది.
  • Petrol Price Guntur: గుంటూరులో లీటరు పెట్రోల్ ధర రూ.110.33, డీజిల్ ధర రూ.96.43గా ఉన్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చూడండి:

ఆ విధానంతో దిగ్గజ కంపెనీల్లో కదలిక.. రెండేళ్లలో దేశీయ చిప్‌లు

ABOUT THE AUTHOR

...view details