మరో వారంలో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి వృద్ధిని పెంచే దిశగా రానున్న బడ్జెట్లో కీలక ప్రకటనలు చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఇక దేశీయ తయారీ, ఉద్యోగాల కల్పన లక్ష్యంగా దిగుమతి సుంకాలపై దృష్టి పెట్టింది ప్రభుత్వం. ఇందులో భాగంగానే దాదాపు 50కిపైగా వస్తువులపై దిగుమతి సుంకాలు పెంచనున్నట్లు తెలుస్తోంది.
ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ ఉత్పత్తులు, రసాయనాలు, హస్తకళలు, మొబైల్ ఫోన్ ఛార్జర్లు, పరిశ్రమల రసాయనాలు, విద్యుత్ దీపాలు, కర్రతో చేసిన ఫర్నిచర్, క్యాండిల్స్, ఆభరణాలు తదితర వస్తువులపై కస్టమ్స్ సుంకాలు పెంచనున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధమున్న రెండు వర్గాలు వెల్లడించాయి.