తెలంగాణ

telangana

'భారత్​తో వాణిజ్య చర్చలకు అమెరికా సిద్ధం'

By

Published : Jun 13, 2019, 3:04 PM IST

భారత్​తో వాణిజ్య చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తెలిపారు. భారత్​-అమెరికా వాణిజ్య మండలి సదస్సులో ఆయన పలు కీలక అంశాలను ప్రస్తావించారు.

మైక్ పాంపియో

భారత్ తన ఆర్థిక వ్యవస్థలను మరింత విస్తరించుకోవాలని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో అన్నారు. అమెరికా కంపెనీల కార్యకలపాలు విస్తరించి ఉన్న దేశాలకు ఇది తోడ్పడుతుందని అన్నారు.

భారత్-అమెరికా వాణిజ్య మండలి సదస్సులో పాంపియో పలు కీలక విషయాలు ప్రస్తావించారు. ఈ నెలాఖరులో భారత పర్యటనకు రానున్న పాంపియో భారత్-అమెరికాల మధ్య వాణిజ్య సమస్యలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక పరమైన అడ్డంకులను తొలగించేందుకు ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఇటీవలే భారత్​కు ఎగుమతుల్లో ప్రత్యేక హోదాను తొలగిస్తూ ట్రంప్​ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

ఇతర దేశాలు అమెరికా సంస్థలకు పారదర్శకమైన, పరస్పర వాణిజ్య విధానాలను అందించాలని పాంపియో కోరారు. అమెరికా కూడా వారికి అలాంటి అవకాశాలనే కల్పిస్తుందని స్పష్టం చేశారు.

భారత్​లో అమెరికాకు చెందిన 500లకు పైగా కంపెనీలు విజయవంతంగా తమ కార్యకలపాలను కొనసాగిస్తున్నాయని.. వస్తు సేవల్లో అమెరికాకు 20 శాతం భారత ఎగుమతులు ఉన్నట్లు తెలిపారాయన.

ఇదీ చూడండి: ఫేస్​బుక్ కొత్త యాప్​తో డబ్బు సంపాదించండి ఇలా!

Intro:Body:

asas


Conclusion:

ABOUT THE AUTHOR

...view details