తెలంగాణ

telangana

పెరిగిన బంగారం ధర- ఏపీ, తెలంగాణలో ఎంతంటే..?

By

Published : Nov 1, 2021, 9:58 AM IST

బంగారం (Gold Rate Today), వెండి (Silver price today) ధరలు సోమవారం స్వల్పంగా పెరిగాయి. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో మేలిమి పుత్తడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

Gold price today
బంగారం ధరలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం (Gold Rate Today), వెండి ధరలు (Silver price today) స్వల్పంగా పెరిగాయి. రెండు రాష్ట్రాల్లో ప్రస్తుత పసిడి, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్​లో పది గ్రాముల మేలిమి పసిడి ధర (Gold Price in Hyderabad) రూ.49,270 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.66,000 వద్ద ఉంది.
  • విజయవాడలో 10 గ్రాముల పుత్తడి (Gold Price in Vijayawada) ధర రూ.49,270గా ఉంది. కిలో వెండి ధర రూ.66,000 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో 10 గ్రాముల బంగారం ధర (Gold Price in Vizag) రూ.49,270గా ఉంది. కేజీ వెండి ధర రూ.66,000 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..

  • ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,785 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
  • ఔన్సు స్పాట్ వెండి ధర 23.83 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

'పెట్రో' బాదుడు

దేశంలో 'పెట్రో'​ బాదుడు కొనసాగుతోంది. తాజాగా లీటర్​ పెట్రోల్​పై 37 పైసలు, లీటర్​ డీజిల్​పై 36 పైసలు పెంచుతూ (Fuel price Today) చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో..

  • హైదరాబాద్​లో (Hyderabad Petrol Price Today) లీటర్ పెట్రోల్​ ధర రూ.114.09కు చేరుకుంది. మరోవైపు లీటర్ డీజిల్​ ధర రూ.106.95గా ఉంది.
  • గుంటూరులో (Guntur Petrol Price) పెట్రోల్ ధర లీటర్​కు రూ.116.06కి చేరింది. డీజిల్​పై ధర​ లీటర్ రూ.108.71 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో (Vizag Petrol Price Today) లీటర్ పెట్రోల్ ధర రూ.114.76 ఉండగా.. లీటర్​ డీజిల్​ ధర రూ.107.45కి చేరింది.

ఇదీ చూడండి:15 రోజుల్లో 5 ఐపీఓలు.. రూ. 27 వేల కోట్ల సమీకరణే లక్ష్యం

ABOUT THE AUTHOR

...view details