తెలంగాణ

telangana

రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో నిర్మలా భేటీ

By

Published : Jan 18, 2021, 10:36 PM IST

దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించే దిశగా బడ్జెట్​ రూపొందించేందుకు కసరత్తు ముమ్మరం చేసింది కేంద్రం. ఈ మేరకు రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సమావేశం అయ్యారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్​.

FM holds pre-Budget meeting with state FMs
'ఆదాయ వనరులు పెంచే దిశగా అడుగులు వేయాలి'

వచ్చే ఆర్థిక ఏడాదికి గాను ప్రవేశపెట్టనున్న బడ్జెట్​పై కరసత్తు ముమ్మరం చేసింది కేంద్రం. ఈ మేరకు రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సోమవారం సమావేశం అయ్యారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. మహమ్మారి నేపథ్యంలో మందగించిన ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, ఆదాయ వనరుల పెంపు దిశగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర మంత్రులు పలు కీలక సూచనలు చేశారు. వర్చువల్​గా జరిగిన ఈ సమావేశంలో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటంలో కేంద్ర ప్రభుత్వం అన్నీ రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇస్తున్న మద్దతును కొనసాగిస్తున్నట్లు నిర్మలా సీతా రామన్​ తెలిపారు. ఇప్పటికే రాష్ట్రాలకు అవసరమైన మేరకు రుణాలను మంజూరు చేయడం, పరిమితులను పెంచడం చేసిందన్నారు. ఇందుకుగాను సమావేశంలో పాల్గొన్న సభ్యులు కేంద్ర ఆర్థిక మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చూడండి: ఇంటి వద్దకే ఎస్‌బీఐ నగదు సేవ‌లు

ABOUT THE AUTHOR

...view details