ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గులు, స్థూల ఆర్థిక గణాంకాలు, దీర్ఘకాలిక బాండ్ల ఆదాయం.. ఇలా అనేక అంశాలు ఈ వారం మార్కెట్లను ముందుకు నడిపే కారకాలుగా ఉండనున్నాయి.
ఫిబ్రవరి నెలకు సంబంధించి వాహన విక్రయ, సేవా, తయారీ రంగాల ఔట్పుట్ గణాంకాలపై విదేశీ, దేశీయ మదుపరులు దృష్టి సారించే వీలుందని విశ్లేషకులు చెబుతున్నారు. పలు రాష్ట్రాల్లో మళ్లీ కరోనా కేసులు భారీగా పెరుగుతుండటం కూడా మార్కెట్లను ప్రభావితం చేసే ప్రధాన అంశమంటున్నారు.
"బలహీన అంతర్జాతీయ సంకేతాలతో మార్కెట్లలో ఒడుదొడుకులు ఉండొచ్చు. మదుపరులు బాండ్ల ఆదాయం, భౌగోళిక పరిణామాలు, ద్రవ్యోల్బణం వంటి అంశాలపై దృష్టి సారించొచ్చు. అమెరికా కొత్త ఉద్దీపన ప్యాకేజీ కీలకంగా మారొచ్చు."