తెలంగాణ

telangana

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

By

Published : Jul 19, 2021, 1:22 AM IST

Updated : Jul 19, 2021, 1:31 AM IST

భద్రతా సిబ్బందికి, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్ముకశ్మీర్​ షోపియాన్‌ జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.

Two terrorists dead
కశ్మీర్​లో ఎన్​కౌంటర్

జమ్ముకశ్మీర్.. షోపియాన్‌ జిల్లా చెక్‌సాదిఖ్‌ ఖాన్‌ ప్రాంతంలో భద్రతా సిబ్బందికి, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు కశ్మీర్ ఐజీపీ విజయ్​ కుమార్ తెలిపారు. మృతుల్లో ఒకరు ఎల్‌ఈటీ కమాండర్‌ అబూ అక్రమ్‌ అని వెల్లడించారు. ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్లు వివరించారు.

ఎల్‌ఈటీ కమాండర్‌ అబూ అక్రమ్‌.. 2017 నుంచి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్​లో ఈ ఏడాదిలో ఇప్పటివరకు మొత్తం 80 మంది ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది మట్టుబెట్టారన్నారు.

ఇదీ చదవండి:జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ముగ్గురు ఉగ్రవాదులు హతం

Last Updated :Jul 19, 2021, 1:31 AM IST

ABOUT THE AUTHOR

...view details