తెలంగాణ

telangana

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ముగ్గురు ముష్కరులు హతం

By

Published : Nov 24, 2021, 5:33 PM IST

encounter

జమ్ముకశ్మీర్​ శ్రీనగర్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో (encounter in kashmir) ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.

జమ్ముకశ్మీర్‌ శ్రీనగర్​ ప్రాంతంలోని రాంభాగ్​లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో (encounter in kashmir) భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. బలగాలు కూంబింగ్‌ నిర్వహిస్తుండగా.. ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తిప్పికొట్టిన బలగాలు తిరిగి కాల్పులు జరపగా, ముగ్గురు ముష్కరులు హతమయ్యారు.

వీరికి సంబంధించిన వివరాలపై భద్రతా సిబ్బంది ఆరా తీస్తున్నారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతంలో భద్రతను మరింత పటిష్ఠం చేశారు.

ABOUT THE AUTHOR

...view details