తెలంగాణ

telangana

Telangana Letter to Polavaram Project Authority : 'ముంపు తేల్చేవరకు 'పోలవరం'లో నిల్వ వద్దు'

By

Published : Jun 5, 2023, 8:11 AM IST

Telangana Letter on Polavaram Back water : పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలంగాణ ఈఎన్సీ లేఖ రాశారు. ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌తో రాష్ట్ర భూభాగంలో ముంపు ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి సర్వే చేపట్టి ముంపు పరిధిని గుర్తించే వరకు జలాశయంలో నీటిని నిల్వ చేయవద్దని పీపీఏను కోరారు.

Telangana Letter to Polavaram Project Authority
Telangana Letter to Polavaram Project Authority

Telangana ENC on Polavaram Back water : పోలవరం ప్రాజెక్టు వెనక జలాలతో రాష్ట్ర భూభాగంలో ముంపు ఏర్పడుతోందని రాష్ట్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఉమ్మడి సర్వే చేపట్టి ముంపు పరిధిని గుర్తించే వరకు జలాశయంలో నీటిని నిల్వ చేయవద్దని పోలవరం ప్రాజెక్టు అథారిటీని రాష్ట్రం కోరింది. ఈ మేరకు ఈఎన్సీ మురళీధర్‌ రాసిన లేఖను పోలవరం ప్రాజెక్టు అథారిటీ విడుదల చేసింది.

Polavaram Project Latest News in Telugu : పోలవరం ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి మట్టం ఎఫ్‌ఆర్‌ఎల్‌-150 అడుగుల వద్ద నీటిని నిల్వ చేస్తే.. రాష్ట్రంలోని 899 ఎకరాలు ముంపునకు గురవుతున్నాయి. గతేడాది జులైలో వచ్చిన భారీ వరదలకు ప్రాజెక్టులో నీరు నిల్వ ఉండి వెనక జలాలు పోటెత్తాయి. అయితే ఏపీ మాత్రం నీటి నిల్వ లేదని చెబుతోందని వెల్లడించిన ఈఎన్సీ.. నిల్వకు సంబంధించిన ఆధారాలు పంపుతూ రివర్‌ క్రాస్‌ సెక్షన్లు, వరద అంచనా, ముంపు ప్రభావంపై అధ్యయనం చేయాలనిపోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి వివరించారు. సుప్రీం సూచనలు, కేంద్ర జల సంఘం ఆదేశాల మేరకు ఉమ్మడి సర్వే పూర్తి కానందున ఈ ఏడాది నీటి నిల్వ చేయొద్దని సూచించారు.

  • Polavaram Survey: 'పోలవరం ముంపుపై తక్షణమే సర్వే చేసేలా ఆదేశించండి'

పోలవరం ముంపు విషయంలో రాష్ట్ర అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా నిర్మాణం చేపట్టవద్దని 2021లో సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు ఈఎన్సీ తెలిపారు. కోర్టు ఉమ్మడి సర్వే చేపట్టాలని సీడబ్ల్యూసీ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ)ను కోరిందని వెల్లడించారు. గోదావరి ట్రైబ్యునల్‌ అవార్డ్‌ సైతం ముంపునకు సంబంధించిన చర్యలు చేపట్టాలని సూచించినట్లు వివరించారు. సుప్రీం ఆదేశాల మేరకు సాంకేతిక కమిటీ సమావేశాలు నిర్వహించి పోలవరం ప్రాజెక్టు సమాచారాన్ని ఇరు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకోవాలని పేర్కొన్నట్లు తెలిపారు.

అవి తెరిచి ఉంచేలా చర్యలు చేపట్టాలి..: ఏపీ ఇచ్చిన సమాచారం మేరకు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం వద్ద తెలంగాణ ప్రాంతంలో 954.05 ఎకరాలు ముంపునకు గురవుతున్నట్లు వెల్లడించారు. దీనిని ఏపీ సైతం అంగీకరించిందన్నారు. అకస్మాత్తుగా వరదలు వస్తే వ్యవసాయ భూములతో పాటు ఐటీసీ పరిశ్రమ, మణుగూరు భార జల కర్మాగారం, ఎత్తిపోతల పథకాలు ప్రభావితమవుతాయని తెలిపారు. భూములు ముంపునకు గురి కాకుండా ఈ ఏడాది వర్షాకాలంలో 48 గేట్లు, రివర్‌ స్లయిస్‌ తెరిచి ఉంచేలా చర్యలు చేపట్టాలని పీపీఏను ఈఎన్సీ కోరారు.

  • పోలవరం ప్రాజెక్టు ముంపుపై తక్షణమే సర్వే చేపట్టాలి: సీడబ్ల్యూసీ

'పోలవరం ముంపు విషయంలో రాష్ట్ర అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా నిర్మాణం చేపట్టవద్దని 2021లో సుప్రీంకోర్టును ఆశ్రయించాం. సుప్రీం ఆదేశాల మేరకు సీడబ్ల్యూసీ సాంకేతిక కమిటీ సమావేశాలు నిర్వహించి పోలవరం ప్రాజెక్టు సమాచారాన్ని రెండు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకోవాలని పేర్కొంది. ఈ మేరకు ఏపీ ఇచ్చిన సమాచారంలో ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం వద్ద తెలంగాణ ప్రాంతంలో 954.15 ఎకరాలు ముంపునకు గురవుతున్నాయని స్పష్టం చేసింది. దీన్ని ఏపీ అంగీకరించింది. గోదావరి ట్రైబ్యునల్‌ అవార్డు కూడా ముంపునకు సంబంధించిన చర్యలు చేపట్టాలని సూచిస్తోంది. అకస్మాత్తుగా వరదలు వస్తే వ్యవసాయ భూములు ముంపునకు గురవడంతో పాటు ఐటీసీ పరిశ్రమ, మణుగూరు భారజల కర్మాగారం, ఎత్తిపోతల పథకాలు ప్రభావితమవుతాయి. భూములు ముంపునకు గురి కాకుండా ఈ ఏడాది వర్షాకాలంలో 48 గేట్లు, రివర్‌ స్లూయీస్‌ తెరిచి ఉంచేలా చర్యలు చేపట్టాలి.' - తెలంగాణ ఈఎన్సీ

ఇవీ చూడండి..

ఏపీపై మరోసారి తెలంగాణ సర్కార్ సీరియస్

A key meeting on Polavaram : పోలవరంపై సమీక్ష... '2025 నాటికి పూర్తి చేయడమే లక్ష్యం'

పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వ 41.15 మీటర్లకే పరిమితం... తేల్చిచెప్పిన కేంద్రం

ABOUT THE AUTHOR

...view details