తెలంగాణ

telangana

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బస్సు.. ఆరుగురు దుర్మరణం

By

Published : Jul 8, 2022, 11:08 AM IST

Updated : Jul 8, 2022, 11:35 AM IST

Road Acciden
Road Acciden

10:59 July 08

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బస్సు.. ఆరుగురు దుర్మరణం

Road Accident: తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. చెంగల్పట్టు ప్రాంతంలో ఆగి ఉన్న ఇనుప లోడ్​ లారీని బస్సు ఢీకొట్టింది. శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో 15 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు.

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేపడతామని చెప్పారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మందికిపైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు. ప్రమాద ధాటికి బస్సు ఎడమ భాగం మొత్తం నుజ్జునుజ్జయింది.

ఇవీ చదవండి:నదిలో కొట్టుకుపోయిన టూరిస్ట్​ కారు.. 9 మంది జలసమాధి.. ఒక్కరు సేఫ్​!

ఆడుకుంటుండగా మీద పడ్డ మెషిన్​.. పాపం ఐదేళ్ల బాలుడు

Last Updated :Jul 8, 2022, 11:35 AM IST

ABOUT THE AUTHOR

...view details