తెలంగాణ

telangana

పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసు.. సెషన్స్​ కోర్టులోనే విచారణ జరపాలి: సుప్రీం

By

Published : Feb 27, 2023, 3:33 PM IST

SC ON EX MINISTER NARAYANA :టెన్త్​ క్లాస్​ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మాజీ మంత్రి నారాయణ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దీనిపై సెషన్స్‌ కోర్టులోనే విచారణ చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది.

SC ON EX MINISTER NARAYANA
SC ON EX MINISTER NARAYANA

SC ON EX MINISTER NARAYANA PETITION : పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజ్‌ కేసు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. మాజీ మంత్రి పొంగులేటి నారాయణ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసు విచారణ సెషన్స్ కోర్టులోనే చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది. మెరిట్ ఆధారంగానే విచారణ కొనసాగించాలని స్పష్టం చేసింది. సెషన్స్ కోర్టు ఉత్తర్వులపై వారం రోజుల్లో హైకోర్టుకు వెళ్లవచ్చన్న సుప్రీంకోర్టు.. అప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ పిటిషన్‌పై విచారణను సుప్రీం ముగించింది.

2023 జనవరి 6న పేపర్‌ లీకేజీ కేసులో మాజీ మంత్రి నారాయణకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. బెయిల్​ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు పై నారాయణ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్​పై విచారణ జరిపిన సుప్రీం.. గతంలో బెయిల్​ రద్దు చేయాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి సైతం నోటీసులు జారీ చేసింది.

అసలేం జరిగింది: 2022 ఏప్రిల్‌ 27న చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం నెల్లేపల్లిలోని జడ్పీ హైస్కూల్‌లో టెన్త్​ క్వచ్చన్​ పేపర్​ లీకైంది. వాట్సాప్‌ ద్వారా తెలుగు ప్రశ్నాపత్రం బయటకు రావటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ లీకేజ్​ వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణ పాత్ర ఉన్నట్లు అప్పట్లో చిత్తూరు పోలీసులు తెలిపారు. అయితే పోలీసుల ఆరోపణలపై నారాయణ తరఫు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు.

నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్​గా 2014లోనే ఆయన వైదొలిగారంటూ లాయర్లు కోర్టుకు తెలిపారు. అయితే ఈ కేసుపై గతంలో జిల్లా కోర్టు, హైకోర్టుల్లోనూ కొన్ని నెలలుగా విచారణ చేపట్టారు. ఆ క్రమంలోనే విచారణ చేపట్టిన హైకోర్టు నారాయణ బెయిల్‌ను రద్దు చేసింది. దీంతో అప్పట్లో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బెయిల్‌ రద్దు విషయంలో విచారణ జరిపిన సుప్రీం.. అప్పట్లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది.

ఉపాధ్యాయులు అరెస్ట్​: పదోతరగతి పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించిన వ్యవహారంలో 2022 ఏప్రిల్​ 29వ తేదీన ఏడుగురు ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని అనంతపురం రేంజి డీఐజీ రవిప్రకాష్‌ తెలిపారు. తమ పాఠశాలలకు మంచి పేరు తేవాలనే స్వార్థంతో కొందరు ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు మాల్‌ ప్రాక్టీసుకు పాల్పడ్డారని, వారికి ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా సహకరించారని డీఐజీ చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details