తెలంగాణ

telangana

నేడు కాంగ్రెస్ ఎంపీలతో సోనియా భేటీ

By

Published : May 7, 2021, 5:05 AM IST

కాంగ్రెస్ ఎంపీలతో ఆ పార్టీ అధినాయకురాలు సోనియాగాంధీ నేడు భేటీ కానున్నారు. ప్రస్తుత కొవిడ్ పరిస్థితిని ఎదుర్కొనేందుకు అవసరమైన రాజకీయ వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

Sonia Gandhi
సోనియా భేటీ

దేశంలో కొవిడ్ ఉద్ధృతి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీలతో పార్టీ అధినాయకురాలు సోనియాగాంధీ శుక్రవారం భేటీ కానున్నారు. ఆన్​లైన్​ విధానంలో సమావేశం జరుగుతుంది. ప్రస్తుత కొవిడ్ పరిస్థితిని ఎదుర్కొనేందుకు అవసరమైన రాజకీయ వ్యూహంపై ఈ సందర్భంగా చర్చిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

బడ్జెట్ సమావేశాల తర్వాత కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ భేటీ కానుండటం ఇదే తొలిసారి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరులు సమావేశంలో పాల్గొంటారు.

ABOUT THE AUTHOR

...view details