తెలంగాణ

telangana

ఆటోపై పడిన లారీ.. ఏడుగురు దుర్మరణం.. నలుగురికి తీవ్ర గాయాలు

By

Published : Jul 22, 2022, 7:06 PM IST

Updated : Jul 22, 2022, 7:37 PM IST

road accident in nuh
road accident in nuh

ఆటోను ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘోర రోడ్డు ప్రమాదం హరియాణాలోని నుహ్​లో జరిగింది.

ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం.. నలుగురికి తీవ్ర గాయాలు

హరియాణా నుహ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. మృతులలో ఇద్దరు మహిళలు, ఉన్నట్లు అధికారులు తెలిపారు. నలుగురు పురుషులు, ఒక మహిళ మృతదేహాలను వెలికితీసి పున్హానా ఆస్పత్రికి తరలించారు.

పున్హానా నుంచి హోడల్​కు ఓ ఆటో ప్రయాణికులతో వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మడియాకి గ్రామానికి సమీపంలో ఓ ట్రక్కు.. ఆటోను ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాలు రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడిపోయాయి. మొదట ఆటో గుంతలో పడగా.. దానిపైన ట్రక్కు పడింది. ఈ ప్రమాదంతో హోడల్​- పన్హానా రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు చేరుకుని ట్రాఫిక్​ను పునరుద్ధరించారు. ప్రమాదానికి సంబంధించిన కారణం తెలియలేదని.. ట్రక్కు డ్రైవర్​ పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్పారు.

ఇవీ చదవండి:అంబానీ కుటుంబ భద్రతపై సుప్రీం కీలక ఆదేశాలు

భూమి కోసం ఒకరు.. భాష కోసం మరొకరు.. ఇద్దరు వృద్ధుల వినూత్న నిరసన

Last Updated :Jul 22, 2022, 7:37 PM IST

ABOUT THE AUTHOR

...view details