తెలంగాణ

telangana

సాగు చట్టాలు, చమురు ధరలపై దద్దరిల్లిన పార్లమెంట్​

By

Published : Mar 10, 2021, 3:10 PM IST

పార్లమెంట్​ ఉభయ సభల్లో మూడో రోజూ వాయిదాల పర్వం కొనసాగింది. సాగు చట్టాలు, చమురు ధరలపై విపక్షాలు ఆందోళనకు దిగగా... గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఉభయ సభలు ఈనెల 15కు వాయిదా పడ్డాయి.

Parliament Budget sessions
సాగు చట్టాలు, చమురు ధరలపై దద్దరిల్లిన పార్లమెంట్​

రెండో విడత బడ్జెట్​ సమావేశాల్లో భాగంగా మూడో రోజు సమావేశమైన పార్లమెంట్​.. విపక్షాల ఆందోళనలతో అట్టుడికింది. సాగు చట్టాలు, చమురు ధరల పెరుగుదలపై నిరసనలతో లోక్​సభ, రాజ్యసభల్లో వాయిదాల పర్వం కొనసాగింది.

లోక్​సభలో..

మూడో రోజు లోక్​సభ ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్​ సహా విపక్ష సభ్యులు.. వివిధ సమస్యలపై చర్చించాలని నినాదాలు చేశారు. విపక్షాల ఆందోళన మధ్యే ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్​ ఓం బిర్లా పలు మార్లు విజ్ఞప్తి చేసినా విపక్ష సభ్యులు వెనక్కి తగ్గలేదు. ఈ నేపథ్యంలో లోక్​సభను మధ్యాహ్నం 12:30 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైనప్పటికీ ఆందోళనలు కొనసాగించారు విపక్ష నేతలు. దాంతో సభను మార్చి 15 వరకు వాయిదా వేశారు స్పీకర్​.

రాజ్యసభలోనూ..

రాజ్యసభలోనూ సాగు చట్టాలపై చర్చ చేపట్టాలను విపక్షాలు ఆందోళనకు దిగాయి. దాంతో తొలుత సభ 12 గంటల వరకు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన కొద్ది సేపటికే 2 గంటల వరకు వాయిదా వేశారు. విపక్షాలు ఆందోళన విరమించకపోవటం వల్ల సభ ఈనెల 15 వరకు వాయిదా పడింది.

బిల్లుకు ఆమోదం

విపక్షాల ఆందోళనల మధ్యే 'మధ్యవర్తిత్వం, సయోధ్య (సవరణ) బిల్లు-2021'కు రాజ్యసభ ఆమోదం తెలిపింది.

ఇదీ చూడండి:కాంగ్రెస్​కు సీనియర్​ నేత చాకో రాజీనామా

ABOUT THE AUTHOR

...view details