తెలంగాణ

telangana

ఐసోలేషన్​లో ప్రియాంకా గాంధీ.. ప్రచారాలపై ఎఫెక్ట్​!

By

Published : Jan 3, 2022, 9:03 PM IST

దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి పెరుగుతుండగా.. పలువురు రాజకీయ ప్రముఖులు సైతం వైరస్ బారిన పడుతున్నారు. బిహార్ మాజీ సీఎం జీతన్ రామ్ మాంఝీ, భాజపా ఎంపీ మహేంద్ర నాథ్ పాండేలకు వైరస్ సోకింది. మరోవైపు, ప్రియాంకా గాంధీ ఐసోలేషన్​కు వెళ్లారు.

Jitan Ram Manjhi Mahendra Nath Pandey Covid positive
ప్రియాంకా గాంధీ జీతన్ రామ్ మాంఝీ కరోనా

Priyanka Gandhi self isolation: కాంగ్రెస్​ అగ్రనేత ప్రియాంకా గాంధీ వాద్రా ఐసోలేషన్​లోకి వెళ్లారు. తన సిబ్బందిలో ఒకరితో పాటు ఓ కుటుంబసభ్యుడికి కరోనా సోకిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రియాంకకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. నెగెటివ్​గా వచ్చింది.

జనవరి 9న ఉత్తరాఖండ్​లోని అల్మోరాలో నిర్వహించే బహిరంగ సభలో ప్రియాంక పాల్గొనాల్సి ఉంది. ప్రస్తుతం ఆమె ఐసోలేషన్​కు వెళ్లిన నేపథ్యంలో.. సభ నిర్వహణపై ప్రభావం పడే అవకాశాముంది! ఈ విషయంపై తదుపరి నిర్ణయం తీసుకోనుంది పార్టీ యంత్రాంగం. జనవరి 4న సమావేశమై దీనిపై చర్చించనుంది.

మాజీ సీఎంకు కొవిడ్

Manjhi Covid positive మరోవైపు, బిహార్​కు చెందిన ప్రముఖ రాజకీయ నేతలిద్దరు కరోనా బారినపడ్డారు. రాష్ట్ర మాజీ సీఎం జీతన్​రామ్ మాంఝీ, భాజపా ఎంపీ డాక్టర్ మహేంద్ర నాథ్ పాండేలకు వైరస్ పాజిటివ్​గా తేలింది.

మాంఝీతో పాటు ఆయన కుటుంబంలో మరో 18 మందికీ కరోనా నిర్ధరణ అయింది. వీరంతా తమ స్వగ్రామమైన మహాకర్​లో స్వీయనిర్బంధంలోకి వెళ్లారు. అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని మాంఝీ పార్టీ అయిన హిందుస్థాన్ ఆవమ్ మోర్చా ప్రతినిధి డానిష్ రిజ్వాన్ తెలిపారు.

Mahendra Nath Pandey Covid

మరోవైపు, మహేంద్ర నాథ్ పాండే.. గాజియాబాద్​లోని యశోద సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలతో రెండు రోజుల క్రితమే ఆయన ఆస్పత్రిలో చేరారు. సోమవారం తెల్లవారుజామున ఆయన్ను ఎమర్జెన్సీ యూనిట్​కు తరలించారు. కరోనా సహా వివిధ పరీక్షలు నిర్వహించారు. దీంతో కొవిడ్ పాజిటివ్​గా తేలింది.

ఇదీ చదవండి:మాజీ ఎమ్మెల్యే బంధువు అరెస్ట్​- ఐసిస్​తో లింకులే కారణం!

ABOUT THE AUTHOR

...view details