పవిత్ర చార్ధామ్ ఆలయాలు అక్షయ తృతీయ సందర్భంగా నేటి నుంచి తెరుచుకోనున్నాయి. అయితే కరోనా రెండో దశ వ్యాప్తి దృష్ట్యా ఈ ఏడాది కూడా భక్తులను దర్శనానికి అనుమతించడం లేదు. అక్షయ తృతీయ సందర్భంగా నేడు యమునోత్రి ధామ్ పోర్టల్ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. గంగోత్రి పోర్టల్ శనివారం ఉదయం 7 గంటల 31 నిమిషాలకు ప్రారంభించనున్నారు అధికారులు. కేదార్నాథ్ ఆలయం మే 17న, బద్రీనాథ్ ఆలయం మే 18న తెరుచుకోనున్నాయి.
నేటి నుంచే చార్ధామ్ యాత్ర.. భక్తులకు నో ఎంట్రీ
చార్ధామ్ యాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది. కరోనా దృష్ట్యా భక్తులకు అనుమతి కల్పించడం లేదు. యమునోత్రి, గంగోత్రి పోర్టల్లు శుక్రవారం,శనివారం ప్రారంభం కానున్నాయి.
![నేటి నుంచే చార్ధామ్ యాత్ర.. భక్తులకు నో ఎంట్రీ Chardham Yatra](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11751815-thumbnail-3x2-sd.jpg)
చార్ధామ్ యాత్ర
ఆలయ పూజాధికాలకు సంబంధించిన ముఖ్యులు, అధికారులు కలిపి 25 మంది కంటే తక్కువగానే ఆలయాలకు హాజరుకానున్నారు.
ఇదీ చదవండి :'18 ఏళ్లు నిండితే వ్యాక్సిన్'..అని కేంద్రం చెప్పినా..!
Last Updated : May 14, 2021, 6:19 AM IST