తెలంగాణ

telangana

ఎన్నికల సన్నద్ధత, 'విజన్​ 2047'పైనే చర్చ.. మంత్రివర్గంలో మార్పులపై సైలెంట్​!

By

Published : Jul 4, 2023, 6:47 AM IST

Updated : Jul 4, 2023, 7:34 AM IST

Central Cabinet Meeting : మంత్రివర్గ సహచరులు వచ్చే ఎన్నికలకు సిద్ధం అయ్యేలా ప్రధాని నరేంద్ర మోదీ దిశా నిర్దేశం చేశారు. మంత్రివర్గ సమావేశానికి నాయకత్వం వహించిన ఆయన.. ఎన్నికల కోసం అంతా కలిసికట్టుగా విజయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

central cabinet meeting
central cabinet meeting

Central Cabinet Meeting : మంత్రివర్గ సహచరులు వచ్చే ఎన్నికలకు సిద్ధం అయ్యేలా ప్రధాని నరేంద్ర మోదీ దిశా నిర్దేశం చేశారు. 9 ఏళ్లలో ఎన్డీయే ప్రభుత్వం చేసిన అన్ని పనులను 9 నెలల్లో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని సూచించారు. ఎన్నికల సమయంలో అందరూ కలిసికట్టుగా విజయం కోసం కృషి చేయాలని.. దిల్లీ ప్రగతి మైదాన్‌లో కొత్తగా నిర్మించిన అంతర్జాతీయ సభా మందిరంలో ప్రధాని హితోపదేశం చేశారు. 5 గంటలపాటు జరిగిన సమావేశం ఫలవంతంగా జరిగిందనీ, ప్రభుత్వ విధానాలకు సంబంధించిన అంశాలపై మంత్రిమండలితో చర్చించామని మోదీ ట్వీట్‌ చేశారు. వేగంగా అభివృద్ధి చెందేందుకు మౌలిక వసతులకు పెద్దపీట వేయాలన్నారు. అమృతకాలం నుంచి 2047నాటికి ప్రజలందరి ఆకాంక్షలు నెరవేర్చేలా శక్తివంచన లేకుండా పని చేయాలని సూచించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు పాత భవనంలోనే జరుగుతాయని చెప్పారు.

'యుద్ధం వచ్చినా నిలదొక్కుకునేలా..'
వేగంగా అభివృద్ధి సాధించాలంటే మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని మోదీ అభిప్రాయపడ్డారు. యుద్ధాల్లాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు కూడా నిలదొక్కుకొనేలా బలంగా ఉండాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొని దేశం సాధించిన అభివృద్ధిని ఆయన అభినందించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులతో పాటు వివిధ శాఖల కార్యదర్శులు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోభాల్​, ఇస్రో చైర్మన్​ కూడా పాల్గొన్నారు. వచ్చే 25 ఏళ్లలో భారత్‌ అభివృద్ధి ఎలా ఉండాలన్న అంశంపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. 2047 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ ఎలాంటి శక్తిగా అవతరిస్తుందన్న అంశాన్ని వివరిస్తూ ఆర్థికశాఖ కార్యదర్శి ప్రజెంటేషన్‌ ఇచ్చారు. మూలధన వ్యయం, మౌలిక వసతుల కల్పన గురించి వివరించారు. విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి కూడా మోదీ పర్యటన, ఇతర అంతర్జాతీయ అంశాల గురించి వివరించారు. ప్రధాని మోదీ తాజాగా చేసిన అమెరికా, ఈజిప్ట్‌ పర్యటనలు ఎలా విజయవంతమయ్యాయో చెప్పారు.

Central Cabinet Reshuffle : అందరూ ఊహించినట్లు ఈ సమావేశంలో మంత్రివర్గ మార్పుపై చర్చ జరగలేదు. చర్చంతా ప్రభుత్వ పనితీరు, భవిష్యత్‌ వ్యూహాలపైనే కొనసాగింది. అయితే వర్షాకాల సమావేశాలకు ముందే కేబినెట్‌ విస్తరణ ఉంటుందన్న ప్రచారం ఉంది. ఎన్​డీఏలో చేరిన ఏక్​నాథ్ శిందే, అజిత్‌ పవార్ వర్గానికి చెందిన నేతలను మంత్రివర్గంలో చేర్చుకుని కూటమి విస్తరించడం ఖాయమని చెబుతున్నారు. కరోనా పరిణామాల అనంతరం కేంద్ర మంత్రిమండలి భేటీ జరగడం ఇది రెండోసారి.

ఇవీ చదవండి :మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్​ భేటీ.. వాటిపైనే కీలక చర్చ?

బాబాయ్​ Vs అబ్బాయ్​.. బహిష్కరణలు, నియామకాలతో చీలిక రాజకీయం!

Last Updated :Jul 4, 2023, 7:34 AM IST

ABOUT THE AUTHOR

...view details