తెలంగాణ

telangana

Parliament New Building Flag Hoisting : కొత్త పార్లమెంట్​ వద్ద జెండా ఎగురవేసిన ఉపరాష్ట్రపతి.. ఇక అక్కడే సమావేశాలు!

By ETV Bharat Telugu Team

Published : Sep 17, 2023, 9:50 AM IST

Updated : Sep 17, 2023, 10:40 AM IST

Parliament New Building Flag Hoisting : కొత్త పార్లమెంట్ భవనం వద్ద ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్​ జగ్​దీప్ ధన్​ఖజ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు అధీర్ రంజన్ చౌదరి, ప్రమోద్ తివారీ పాల్గొన్నారు.

Parliament New Building Flag Hoisting
Parliament New Building Flag Hoisting

Parliament New Building Flag Hoisting :ఉపరాష్ట్ర జగదీప్‌ ధన్‌ఖడ్‌.. కొత్త పార్లమెంట్‌ భవనం వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. సోమవారం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఒక రోజు ముందుగా ఈ కార్యక్రమం జరిగింది. కొత్త పార్లమెంట్‌ గజ ద్వారం వద్ద ధన్‌ఖడ్‌ జెండాను ఆవిష్కరించిన కార్యక్రమంలో లోక్​సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్రమంత్రులు ప్రహ్లాద్ జోషి, పీయూష్ గోయల్​, కాంగ్రెస్ ఎంపీలు అధీర్ రంజర్ చౌదరి, ప్రమోద్ తివారీ పాల్గొన్నారు. అంతకుముందు పార్లమెంట్​లో విధులు నిర్వహించే సీఆర్​పీఎఫ్ సిబ్బంది నుంచి ఉపరాష్ట్రపతి జగ్​దీప్ ధన్​ఖడ్​, లోక్​సభ స్పీకర్ ఓం బిర్లా గౌరవ వందనం స్వీకరించారు.

'ఇదొక చరిత్రాత్మక ఘట్టం'
Flag Hoisting At New Parliament Building :కొత్త పార్లమెంట్ భవనం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడాన్ని ఒక చారిత్రక ఘట్టంగా అభివర్ణించారు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగ్​దీప్ ధన్​ఖడ్​. ' భారత్ శక్తి, సామర్థ్యాలను ప్రపంచం మొత్తం గుర్తించింది. దేశం అభివృద్ధి, విజయాలను సాధిస్తున్న కాలంలో మనం జీవిస్తున్నాం.' అని అన్నారు.

'నేను పనికిరానా'
Congress New Party Name Building :కొత్త పార్లమెంట్ భవనం వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్​ గాంధీ గైర్హాజరు కావడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందించారు ఆ పార్టీ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి. 'నేను జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడానికి పనికిరాకపోతే చెప్పండి. ఇక్కడి నుంచి వెళ్లిపోతాను. ఈ కార్యక్రమానికి హాజరైనవారిపై దృష్టి పెట్టండి.' అని బదులిచ్చారు.

'నేను రాలేకపోతున్నా'
అంతకుముందు.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. కొత్త పార్లమెంట్​లో జరిగే జెండా వందనం కార్యక్రమానికి తాను హాజరుకాలేనని చెప్పారు. తనకు చాలా ఆలస్యంగా ఆహ్వానం అందడం పట్ల నిరాశ చెందుతున్నానని లోక్​సభ సెక్రటరీ జనరల్​ సీసీ మోదీకి లేఖ రాశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు సెప్టెంబర్ 16, 17వ తేదీల్లో హైదరాబాద్‌లో జరగుతున్నాయని.. తాను కొత్త పార్లమెంట్ భవనం వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరుకావడం సాధ్యం కాదని లేఖలో పేర్కొన్నారు.

History of Parliament House of India : 75 ఏళ్ల భారత పార్లమెంటు చరిత్ర.. తగ్గుతున్న యువతరం.. పెరిగిన మహిళా బలం..

Parliament New Uniform : పార్లమెంట్​ సిబ్బంది కొత్త యూనిఫాంపై 'కమలం' గుర్తు!.. కాంగ్రెస్​ ఫైర్​.. 'పులి, నెమలి ఎందుకు గుర్తురాలేదు?'

Last Updated : Sep 17, 2023, 10:40 AM IST

ABOUT THE AUTHOR

...view details