తెలంగాణ

telangana

Odisha Train Accident : పరిమళించిన మానవత్వం.. అర్ధరాత్రి వేలమంది రక్తదానం

By

Published : Jun 3, 2023, 10:54 AM IST

Updated : Jun 3, 2023, 11:23 AM IST

Odisha Train Accident : ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో వందల మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరందరినీ హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు. తీవ్ర గాయాల వల్ల క్షతగాత్రులకు రక్తం ఎక్కువగా పోయింది. ప్రమాద బాధితులకు చికిత్స చేసేందుకు రక్తం అత్యవసరమైంది. ఈ సమయంలో పోలీసులు, స్థానిక ప్రజలు మానవత్వం చాటుకున్నారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వేల మంది ప్రజలు అర్ధరాత్రి సమయంలో రక్తదానం చేసి మంచి మనసు చాటుకున్నారు. బాలేశ్వర్ ఆస్పత్రికి అర్ధరాత్రి వేళ సుమారు రెండు వేల మంది రక్తదానం చేసేందుకు ముందుకు రావడం చూసి వైద్యుల, అధికారుల కళ్లు చెమర్చాయి.

Odisha Train Accident
Odisha Train Accident

Odisha Train Accident : ఒడిశాలో ఘోర రైలు ప్రమాదంలో వందల మంది ప్రయాణికులు తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో చేరారు. వారందరికీ తీవ్ర రక్తస్రావం జరిగింది. వారికి చికిత్స చేసేందుకు రక్తం అత్యవసరమైంది. వైద్యులకు ఏం చేయాలో పాలుపోని స్థితిలో.. పోలీసులు, స్థానికులు పెద్ద మనసు చాటుకున్నారు. అర్ధరాత్రి వేళ మనకెందుకులే అని అనుకోకుండా.. క్షతగాత్రుల ప్రాణాలు కాపాడేందుకు ఆస్పత్రులకు వేలల్లో తరలివచ్చారు. బాలేశ్వర్​ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో గాయపడిన వారికి రక్తదానం చేసేందుకు రెండు వేల మంది ప్రజలు ముందుకు వచ్చారు. మిగిలిన ఆస్పత్రుల్లోనూ వందల మంది స్థానికులు, పోలీసులు.. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. అర్ధరాత్రి వేళ ప్రజలు రక్తదానం చేసేందుకు పెద్ద ఎత్తున ముందుకు రావడం చూసి వైద్యులు, అధికారుల కళ్లు చెమర్చాయి.

Odisha Blood Donation : బాలేశ్వర్​లో అర్ధరాత్రి 500 యూనిట్ల రక్తాన్ని సేకరించగా.. తొమ్మిది వందల యూనిట్ల రక్తం స్టాక్‌లో ఉందని వైద్యులు తెలిపారు. రక్తదానం చేసేందుకు ప్రజలు ఇంకా తరలివస్తున్నారని ఒడిశా ప్రభుత్వం వెల్లడించింది. ప్రమాదంలో బాధితులకు అవసరమైన సమయంలో రక్తదానం చేసిన ప్రజలకు ఒడిశా ప్రభుత్వం కృతజ్ఞతలు తెలిపింది. క్లిష్ట సమయంలో మీరు చేసిన రక్తదానాన్ని మరచిపోమంటూ ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే జెనా భావోద్వేగానికి గురయ్యారు. క్షతగాత్రుల ప్రాణాలు కాపాడేందుకు ఈ రక్తం చాలా ఉపయోగపడుతోందని, స్వచ్ఛంద సేవకులందరికీ రుణపడి ఉంటాననని ఒడిశా సీఎస్‌ వెల్లడించారు.

"ప్రమాద స్థలంలో 200కు పైగా అంబులెన్సులు ఉన్నాయి. సుమారు 75 మందితో కూడిన వైద్యుల బృందాన్ని సైతం అందుబాటులో ఉంచాం. ప్రభుత్వ యంత్రాంగమంతా ఘటనా స్థలంలోనే ఉంది. ఒక బోగీ తీవ్రంగా ధ్వంసమైంది. దానిని కట్ చేసేందుకు ఎన్​డీఆర్​ఎఫ్​, ఓడీఆర్​ఎఫ్​, ఫైర్​ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మృతదేహాల శవపరీక్షల అనంతరం వారి బంధువులకు అప్పగిస్తాం."

--పీకే జెనా, ఒడిశా సీఎస్‌

ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ సహా భద్రక్‌, మయూర్‌బంజ్‌, కటక్‌ల్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు కూడా గాయపడ్డ వారిని తరలించారు. గాయపడ్డవారిని తరలించడం చూస్తుంటే యుద్ధ భూమిలో ఉన్నట్లు ఉందని ఓ రైల్వే ఉన్నతాధికారి ఆవేదన వ్యక్తం చేశారు. హారీడ్ వైద్య సిబ్బంది నిర్విరామంగా విధుల్లో పాల్గొంటున్నారు. సుమారు 526 మంది ప్రయాణికులు ఇక్కడ చికిత్స పొందుతున్నారు.

ప్రమాదం జరిగింది ఇలా..
Odisha Train Accident Death Number : ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లాలో అనూహ్య రీతిలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 200 మందికి పైగా మృతి చెందారు. 900 మందికి పైగా గాయాపడ్డారు. బెంగళూరు-హావ్‌డా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ బాలేశ్వర్‌ సమీపంలోని బహానగా బజార్‌ వద్ద శుక్రవారం రాత్రి దాదాపు ఏడు గంటల ప్రాంతంలో తొలుత పట్టాలు తప్పింది. ఫలితంగా దాని బోగీలు పక్కనే ఉన్న ట్రాక్‌పై పడ్డాయి. వాటిని షాలిమార్‌-చెన్నై సెంట్రల్‌ కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టింది. దాంతో కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన పదిహేను బోగీలు బోల్తాపడ్డాయి. అనంతరం బోల్తాపడ్డ కోరమండల్‌ కోచ్‌లను పక్కనున్న ట్రాక్‌పై దూసుకొచ్చిన గూడ్సు రైలు ఢీకొంది. మూడు రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకోవడం వల్ల ప్రమాదం తీవ్రత పెరిగింది. ఘటన జరిగిన గురైన సమయంలో కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ కోల్‌కతా నుంచి చెన్నైకి వెళ్తోంది.

ఇవీ చదవండి :'ఒకేసారి రెండు రైళ్లకు సిగ్నల్​.. అందుకే ప్రమాదం'.. చెల్లాచెదురుగా మృతదేహాలు

Odisha Train Accident : పరిమళించిన మానవత్వం.. అర్ధరాత్రి వేలమంది రక్తదానం

Last Updated :Jun 3, 2023, 11:23 AM IST

ABOUT THE AUTHOR

...view details