తెలంగాణ

telangana

Modi On Olympics : '2029 యూత్​ ఒలింపిక్స్​ ఆతిథ్యానికి భారత్​ రెడీ.. 2036 కోసం భగీరథ ప్రయత్నం!'

By ETV Bharat Telugu Team

Published : Oct 14, 2023, 9:42 PM IST

Modi On Olympics : 2036 ఒలింపిక్స్​ నిర్వహణకు వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని భారత్​ వదులుకోదని స్పష్టం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. 2029 యూత్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్​ సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు. దేశంలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు బీజేపీ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు.

Modi On Olympics
Modi On Olympics

Modi On Olympics : 2029 యూత్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్​ సిద్ధంగా ఉన్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నుంచి తమకు కచ్చితంగా మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నట్లు మోదీ తెలిపారు. 2036 ఒలింపిక్స్​ నిర్వహణకు వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని భారత్​ వదులుకోదని స్పష్టం చేశారు. దేశంలో ఒలింపిక్స్​ నిర్వహణ.. 140 కోట్ల మంది భారతీయుల కల అని అభివర్ణించారు. ప్రపంచ స్పోర్ట్స్​ టోర్నమెంట్​లను నిర్వహించే సామర్థ్యాన్ని భారత్​ ప్రదర్శించిందని చెప్పారు. మహరాష్ట్ర ముంబయిలో నీతా ముకేశ్​ అంబానీ కల్చరల్ సెంటర్​లో 141వ అంతర్జాతీయ ఒలింపిక్​ కమిటీ సెషన్​లో​ మోదీ ప్రసంగించారు.

భారత్​లో క్రీడల వారసత్వం..
Modi At NMACC Mumbai :సింధు లోయ నాగరికత నుంచి వేదాల యుగం వరకు.. మన దేశంలో క్రీడల వారసత్వం సుసంపన్నంగా ఉందని మోదీ చెప్పారు. 'ఒకే భూమి- ఒకే కుటుంబం- ఒక భవిష్యత్తు' అనే భావనను క్రీడలు బలపరుస్తున్నట్లు చెప్పారు. దేశంలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు బీజేపీ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నట్లు వివరించారు. భారత్​లో 40 ఏళ్ల తర్వాత ఐఓసీ సెషన్​ జరగడం.. అది కూడా ముంబయిలో జరగడం దేశానికి గర్వకారణంగా చెప్పారు.

టీమ్​ఇండియాకు అభినందనలు..
Ind Vs Pak World Cup 2023 Modi : భారత్​ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్​లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో టీమ్​ఇండియా విజయం సాధించడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. "అహ్మదాబాద్‌లో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో చరిత్రాత్మక విజయం సాధించినందుకు టీమ్​ఇండియాను అభినందిస్తున్నాను. మన సంస్కృతితోపాటు భారతీయుల జీవనశైలిలో క్రీడలు ముఖ్యమైన భాగం" అని మోదీ తెలిపారు.

అతి పెద్ద ప్రజాస్వామ్యానికి మోదీ రూపశిల్పి..
IOC Session Mumbai 2023 : 40 సంవత్సరాల తర్వాత భారత్​లో చరిత్రాత్మక ఐఓసీ సెషన్​కు ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణంగా ఉందని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యురాలు నీతా అంబానీ తెలిపారు. ప్రధాని మోదీ.. ఈ కార్యక్రామానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యానికి నవ భారత రూపశిల్పి మోదీ అంటూ నీతా అంబానీ కొనియాడారు. క్రీడలకు మోదీ ఇచ్చిన మద్దతే ఈ సెషన్​ ఇక్కడ జరిగేలా చేసిందని ఆమె అన్నారు. భారత్​ ఆర్థికంగా, క్రీడల్లో కూడా అభివృద్ధి చెందుతోందని ఐఓసీ ప్రెసిడెంట్​ థామస్​ బాచ్​ కొనియాడారు. భారత్​ ఒక స్ఫూర్తిదాయకమైన ప్రదేశంగా వర్ణించారు.

Cricket In Olympics 2028 : ఒలింపిక్స్​లో క్రికెట్​కు చోటు.. ఐఓసీ కీలక నిర్ణయం.. ఎప్పటి నుంచంటే?

Neeraj Chopra Paris Olympics : నీరజ్ చోప్రా భళా.. పారిస్​ ఒలింపిక్స్​కు అర్హత

ABOUT THE AUTHOR

...view details