తెలంగాణ

telangana

లోయలో పడ్డ కారు.. 8 మంది మృతి

By

Published : Aug 30, 2022, 6:07 PM IST

Updated : Aug 30, 2022, 6:34 PM IST

jammu kashmir road accident today
లోయలో పడ్డ కారు

Jammu Kashmir Road Accident : ఎస్​యూవీ అదుపు తప్పి లోయలో పడిపోయిన ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం జమ్ముకశ్మీర్​ కిష్టవర్​లో జరిగింది.

Jammu Kashmir Road Accident : జమ్ముకశ్మీర్ కిష్టవర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింగామ్​ నుంచి చట్రూకు వెళ్తున్న ఓ ఎస్​యూవీ.. బోండా గ్రామం వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా అదుపు తప్పింది. రోడ్డుపై నుంచి జారి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది మరణించగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో జరిగిందని అధికారులు తెలిపారు.

ప్రమాద సమాచారం అందిన వెంటనే అధికారులు, సహాయక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. వాహనంలోని ఐదుగురు అప్పటికే మరణించినట్లు గుర్తించారు. తీవ్రంగా గాయపడ్డ మరో ఆరుగురిని ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే ముగ్గురు మరణించినట్లు అధికారులు వెల్లడించారు. మిగిలిన ముగ్గురిని ఆస్పత్రిలో చేర్చామని.. వారి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.

కేంద్ర మంత్రి విచారం
ఈ ఘటన దురదృష్టకరమని అన్నారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. బాధితులకు పూర్తి సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రమాదంపై సంతాపం వ్యక్తం చేసిన మాజీ మంత్రి జీఎం సరూరి.. మృతుల కుటుంబాలకు తక్షణమే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:'నా లాకర్లలో ఏం దొరకలేదు.. సీబీఐ క్లీన్​చిట్​ ఇచ్చింది'

గూగుల్​ మ్యాప్స్​ను నమ్మి వరదలో చిక్కుకున్న ఫ్యామిలీ.. లక్కీగా...

Last Updated :Aug 30, 2022, 6:34 PM IST

ABOUT THE AUTHOR

...view details