తెలంగాణ

telangana

కుమార్తెను రేప్ చేసి చంపిన తండ్రి- ప్రేమ వివాహం చేసుకుందని...

By

Published : Nov 16, 2021, 7:39 PM IST

మధ్యప్రదేశ్​లోని భోపాల్​లో ఈనెల 4న జరిగిన ఓ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రేమ వివాహం చేసుకుందన్న కారణంతో కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడో కిరాతకుడు. తర్వాత ఆమెను దారుణంగా హత్య చేశాడు.

man rapes daughter
కూతురిపై తండ్రి అత్యాచారం.

కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కూతురిపై కర్కశంగా ప్రవర్తించాడు. తన ఇష్టానికి విరుద్ధంగా ప్రేమ వివాహం చేసుకుందన్న కారణంతో ఆమెపై అత్యాచారానికి పాల్పడి, ఆమెను కడతేర్చాడు. మధ్యప్రదేశ్​లోని భోపాల్​ జిల్లాలో ఈనెల 4న జరిగిన ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

అంత్యక్రియలకు వెళ్తూ..

బాధితురాలు ఏడాది క్రితం ఓ వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుని సీహోర్ జిల్లాలోని బిల్కిస్​గంజ్​​ ప్రాంతంలో నివాసం ఉంటోంది. ఇటీవల ఆమె సమస్​గఢ్​లోని అక్క ఇంటికి వచ్చింది. ఈనెల 4న బాధితురాలి కుమారుడు అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో చిన్నారి అంత్యక్రియలు నిర్వహించేందుకు బాధితురాలి అక్క.. తండ్రిని పిలిచింది.

అంత్యక్రియల కోసమని మృతిచెందిన శిశువుతో బాధితురాలిని తన బండిపైన కొంతదూరం తీసుకెళ్లాడు తండ్రి. ఆ తర్వాత ఆమెను అడవిలోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత దారుణంగా హత్య చేశాడు. ఈ విషయాన్ని కుమారుడికి చెప్పిన నిందితుడు.. తిరిగి గ్రామానికి చేరుకున్నాడు.

ఆదివారం ఓ ఫారెస్ట్ గార్డ్..​ బాధితురాలు, ఆమె పక్కనే ఆరునెలల శిశువు మృతదేహాలు గుర్తించడం వల్ల అసలు విషయం బయటపడింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్​ చేశారు. తమ ఇష్టాలకు విరుద్ధంగా బాధితురాలు ప్రేమ పెళ్లి చేసుకోవడం పట్ల తన కుటుంబం కోపంగా ఉందని.. అందుకే ఆమెపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డానని నిందితుడు పోలీసులకు వెల్లడించాడు.

ఇదీ చూడండి :యువతి దారుణ హత్య.. జననాంగాన్ని కాల్చేసి...

ABOUT THE AUTHOR

...view details