తెలంగాణ

telangana

'శరద్​ పవార్ తగ్గేదేలే.. ఈ సర్కస్ ఎక్కువ కాలం నిలవదు!'

By

Published : Jul 2, 2023, 4:03 PM IST

Updated : Jul 2, 2023, 6:33 PM IST

Maharashtra Political Crisis : మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్​సీపీ కీలక నేత అజిత్​ పవార్.. ఎన్​డీఏలో చేరి, డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయడంపై శివసేన(యూబీటీ), ఎన్​సీపీ మండిపడ్డాయి. ఎన్​సీపీ నాయకులు పార్టీ అధినేత శరద్ పవార్ వెంటే ఉన్నారని అన్నారు ఎన్​సీపీ అధికార ప్రతినిధి మహేశ్ భరత్​. మరోవైపు.. బీజేపీ-శివసేన(శిందే వర్గం)- ఎన్​సీపీ(అజిత్ పవార్ వర్గం).. కూటమిని సర్కస్​గా అభివర్ణించారు సంజయ్​ రౌత్​.

maharashtra political crisis
maharashtra political crisis

Ajit Pawar Joins NDA : ఎన్​సీపీ కీలక నేత అజిత్ పవార్​ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయడంపై ఆ పార్టీ అధికార ప్రతినిధి మహేశ్ భరత్ తపసే స్పందించారు. ఎన్​సీపీ నాయకులు చాలా మంది శరద్​ పవార్​తోనే ఉన్నారని ఆయన చెప్పారు. రాజ్​భవన్​లో ఎన్​సీపీ నాయకులు చేసిన ప్రమాణ స్వీకారాన్ని తాము గుర్తించమని అన్నారు.

బీజేపీకి కర్ణాటక ఫలితాలే 'మహా'లో కూడా రిపీట్​'
మరోవైపు ఇప్పటకిప్పుడు మహారాష్ట్రలో ఎన్నికలు జరిగితే.. బీజేపీకి కర్ణాటక ఫలితాలు వస్తాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సచిన్ సావంత్ అన్నారు. మహారాష్ట్రలో గెలవాలంటే ఎన్‌సీపీని చీల్చడం తప్ప బీజేపీకి వేరే మార్గం లేదని విమర్శించారు. ఎన్​సీపీని.. బీజేపీ చీలుస్తుందని తమకు ఎప్పుడో తెలుసని చెప్పారు. బీజేపీ అసలు రంగు ఇప్పుడు బయటపడిందని సావంత్ విమర్శించారు.

'సర్కస్​ ఎక్కువ కాలం ఉండదు'
మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై శివసేన(యూబీటీ) వర్గం నాయకుడు సంజయ్ రౌత్ స్పందించారు. ఎన్​సీపీ చీలికతో ఆ పార్టీ అధినేత శరద్ పవార్​ అధైర్యపడలేదని చెప్పారు. ఎన్​డీఏలో అజిత్​ పవార్ చేరడంపై స్పందిస్తూ.. ఈ సర్కస్​ ఎక్కువ కాలం ఉండదని ఎద్దేవా చేశారు.

'నేను ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌తో ఇప్పుడే మాట్లాడాను. ఆయన దృఢంగా ఉన్నారు. ప్రజల మద్దతు ఆయనకే ఉందని చెప్పారు. ఇటువంటి సర్కస్​ను మహారాష్ట్ర ప్రజలు ఎక్కువ కాలం సహించరు. కొంతమంది మహారాష్ట్ర రాజకీయాలను పూర్తిగా నాశనం చేయాలని నిశ్చయించుకున్నారు. వారు ఎంచుకున్న మార్గంలో ముందుకు వెళ్లనివ్వండి'

--సంజయ్ రౌత్​, శివసేన యూబీటీ వర్గం నాయకుడు

'ట్రిపుల్ ఇంజిన్ సర్కార్​'
మరోవైపు అజిత్ పవార్​.. ఎన్​డీఏలో చేరడంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్​నాథ్ శిందే స్పందించారు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఒక ముఖ్యమంత్రి, ఇద్దరు ఉపముఖ్యమంత్రులు ఉన్నారని అన్నారు. ' ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ కాస్త ట్రిపుల్ ఇంజిన్ సర్కార్​గా మారింది. మహారాష్ట్ర అభివృద్ధి కోసం.. అజిత్ పవార్, ఎన్​సీపీ నాయకులు ప్రభుత్వంలో భాగం కావడాన్ని నేను సంతోషిస్తున్నాను. అజిత్ పవార్ అనుభవం రాష్ట్రాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.' అని శిందే అభిప్రాయపడ్డారు.

Last Updated :Jul 2, 2023, 6:33 PM IST

ABOUT THE AUTHOR

...view details