తెలంగాణ

telangana

ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం బంధువుల ఇంట్లో ఐటీ సోదాలు

By

Published : Oct 7, 2021, 2:13 PM IST

Updated : Oct 7, 2021, 5:14 PM IST

income tax raid in maharashtra
ఐటీ దాడులు ()

ఆదాయ పన్ను శాఖ దేశంలోని అనేక ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar News) బంధువులు, ఆ రాష్ట్రంలోని మరికొందరు రియల్ ఎస్టేట్ డెవలపర్ల నివాసాలు, కార్యాలయాలపై గురువారం దాడులు జరిపింది.

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఎన్​సీపీ నేత అజిత్ పవార్ (Ajit Pawar News) బంధువుల నివాసాలు, కార్యాలయాలపై ఆదాయ పన్ను శాఖ గురువారం దాడులు (IT Raid) జరిపింది. పన్ను ఎగవేత ఆరోపణలపై ఆ రాష్ట్రంలోని కొందరు స్థిరాస్తి వ్యాపారుల ఇళ్లు, ఆఫీసుల్లోనూ సోదాలు చేసింది.

ముంబయి (IT Raid in Mumbai), పుణె, సతారా సహా మహారాష్ట్ర, గోవాలోని మరికొన్ని నగరాల్లో ఐటీ దాడులు జరిగినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. డీబీ రియాల్టీ, శివాలిక్, జరండేశ్వర్ సాఖర్ షుగర్ కార్ఖానా (జరండేశ్వర్ ఎస్​ఎస్​కే), పవార్​ సోదరీమణుల (Ajit Pawar Family) వ్యాపార సముదాయాల్లో సోదాలు చేసినట్లు తెలిపాయి. ఇప్పటికే కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకుని, వాటిని పరిశీలిస్తున్నట్లు చెప్పాయి.

జరండేశ్వర్​ ఎస్​ఎస్​కేపై గతంలోనే..

మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద జరండేశ్వర్​ ఎస్​ఎస్​కే ఆధ్వర్యంలోని షుగర్ మిల్​కు (Jarandeshwar Sugar News) చెందిన రూ.65కోట్లు విలువైన ఆస్తులను ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)​ జులైలోనే జప్తు చేసింది. సహకార సంస్థగా నడుస్తున్న ఈ షుగర్​ మిల్..​ పవార్​ కుటుంబానికి సంబంధించిందేనని ఈడీ (Enforcement Directorate News) పేర్కొంది.

ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్

"జరండేశ్వర్​ ఎస్​ఎస్​కేకు చెందిన ఆస్తులు.. గురు కమొడిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్​ (ఇది ఒక డమ్మీ కంపెనీగా ఆరోపణలున్నాయి) పేరిట ఉన్నాయి. దాని నుంచి వాటిని జరండేశ్వర్​ షుగర్​ మిల్స్​కు లీజుకు ఇచ్చారు. జరండేశ్వర్​ షుగర్​ మిల్స్​లో మెజారిటీ వాటా స్పార్క్లింగ్​ సాయిల్​ ప్రైవేట్​ లిమిటెడ్​కు ఉంది. అది అజిత్ పవార్​, ఆయన భార్య సునేత్ర పవార్​కు (Ajit Pawar Family) చెందినదే అని దర్యాప్తులో తేలింది" అని ఈడీ ఓ ప్రకటనలో పేర్కొంది. అజిత్ పవార్ (Ajit Pawar News)​ మాత్రం తాను ఏ తప్పు చేయలేదని చెప్పారు.

ఇదీ జరిగింది..

మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకు (ఎంఎస్​సీబీ) కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ ఈ సోదాలు చేపట్టింది. ఈ (MSCB Scam) కేసులో.. షుగర్ ఫ్యాక్టరీ(ఎస్​ఎస్​కే)లను ఎంఎస్​సీబీ అధికారులు, డైరెక్టర్లు ఎస్​ఏఆర్​ఎఫ్​ఏఈఎస్​ఐ చట్టానికి లోబడి సరైన ప్రక్రియను అనుసరించకుండా చాలా చౌకగా తమ బంధువులకు అమ్మేశారనే ఆరోపణలున్నాయి.

"2010లో జరండేశ్వర్​ ఎస్​ఎస్​కేను నిబంధనలకు విరుద్ధంగా తక్కువ విలువకే ఎంఎస్​సీబీ వేలం వేసింది. ఆ సమయంలో ఎంఎస్​సీబీ బోర్డు ఆఫ్​ డైరెక్టర్లలో అజిత్ పవార్ అత్యంత కీలకమైన, శక్తిమంతమైన సభ్యుడు" అని ఈడీ (Enforcement Directorate News) పేర్కొంది.

ఈ ఎస్​ఎస్​కేను గురు కమొడిటీ సర్వీసెస్​ కొనుగోలు చేసి, వెంటనే జరండేశ్వర్ షుగర్ మిల్స్​కు లీజుకు ఇచ్చింది. ఈ కొనుగోలుకు వినియోగించిన అధిక భాగం నిధులు.. స్పార్క్లింగ్​ సాయిల్ నుంచి జరండేశ్వర్​ షుగర్​ మిల్స్​కు, అనంతరం దాని నుంచి గురు కమొడిటీ సర్వీసెస్​కు అందినట్లు ఈడీ తెలిపింది.

జప్తు చేసిన షుగర్​ మిల్​.. వాస్తవంలో జరండేశ్వర్​ షుగర్​ మిల్స్(Jarandeshwar Sugar News) ఆధ్వర్యంలోనే నడుస్తోందని ఈడీ పేర్కొంది.

అజిత్ పవార్

ఇందులో బంధువులను లాగడం బాధించింది..

తన సంస్థలపై ఆదాయపు పన్ను విభాగం దాడులు చేయడం వల్ల తనకేం సమస్య లేదని రాష్ట్ర ఆర్థిక మంత్రి కూడా అయిన అజిత్ పవార్ (Ajit Pawar News) అన్నారు. అయితే ఇందులోకి తన సోదరీమణులను (Ajit Pawar Family) లాగడం బాధించిందని తెలిపారు.

"ఏటా మేము పన్నులు కడతాం. నేను ఆర్థిక మంత్రిని. నాకు ఆర్థిక క్రమశిక్షణ గురించి తెలుసు. నాకు చెందిన అన్ని సంస్థలు పన్నులు చెల్లించాయి. కోల్హాపుర్​, పుణెలో నివసిస్తున్న నా ముగ్గురు సోదరీమణులపై ఐటీ దాడులు జరిగాయి. 35 ఏళ్ల కిందట వివాహం జరిగిన వారి ఇళ్లల్లో సోదాలు జరపడం బాధించింది. నాతో సంబంధం ఉందనే కారణంగా వారిపై దాడులు జరిగి ఉంటే.. ప్రభుత్వ సంస్థలను ఎలా దుర్వినియోగపరుస్తున్నారో ప్రజలు ఆలోచించాలి."

- అజిత్ పవార్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి

ఓ బ్యాంకు కేసులో ఎన్​సీపీ అధినేత శరద్ పవార్​ను (Sharad Pawar News) కూడా లాగారని అజిత్ పవార్ గుర్తుచేశారు. ఈ దాడుల వెనకాల రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయా లేదా అని ఐటీ విభాగమే చెప్పాలని అన్నారు.

ఇదీ చూడండి:లఖింపుర్‌ ఘటనపై యోగి సర్కార్​కు సుప్రీం ప్రశ్నలు

Last Updated :Oct 7, 2021, 5:14 PM IST

ABOUT THE AUTHOR

...view details