తెలంగాణ

telangana

రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం? రంగంలోకి రాజ్​నాథ్​, నడ్డా!

By

Published : Jun 12, 2022, 5:37 PM IST

Updated : Jun 12, 2022, 6:28 PM IST

bjp
భాజపా

JP Nadda president elections: రాష్ట్రపతి ఎన్నికల కసరత్తును భాజపా ముమ్మరం చేసింది. ఈ ఎన్నికల బాధ్యతలను భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​​ సింగ్​కు అప్పగించింది.

JP Nadda president elections: రాష్ట్రపతి ఎన్నికల నగారా మోగిన క్రమంలో దేశంలో రాజకీయాలు మరోమారు వేడెక్కాయి. ఈ ఎన్నికలను భాజపా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రపతి అభ్యర్థిపై ఏకాభిప్రాయ సాధనే లక్ష్యంగా అధికార ఎన్​డీఏలోని భాగస్వామ్యపక్షాలు, విపక్ష పార్టీలతో చర్చించే బాధ్యతను భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​కు అప్పగించింది.

రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్​డీఏ అభ్యర్థిని ఓడించేందుకు విపక్షాలు కసరత్తు ముమ్మరం చేసిన నేపథ్యంలో భాజపా ఈ నిర్ణయం తీసుకుంది. స్వతంత్రంగా ఉంటున్న వైకాపా, బీజేడీ వంటి పార్టీలతోనూ సంప్రదింపులు నడ్డా, రాజ్​నాథ్ జరపనున్నారు. ప్రస్తుతం జేడీయూ, ఎల్​జేపీ, అప్నాదళ్, అన్నాడీఎంకే, జేజేపీ, ఈశాన్య రాష్ట్ర పార్టీలైన ఎన్‌పీపీ, ఎన్​పీఫ్​, ఏజీపీ పార్టీలు ఎన్​డీఏ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి.

జులై 18న తేదీన రాష్ట్రపతి ఎన్నికను పోలింగ్ నిర్వహించనున్నట్లు, జూలై 21న ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నట్లు కొద్ది రోజుల క్రితం కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ప్రస్తుత రాష్ట్రపతిగా ఉన్న రామ్​నాథ్​ కోవింద్ పదవీ కాలం ఈ ఏడాది జూలై 24తో పూర్తవనుంది. ఆయన 2017 జూలై 25న దేశ 14వ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్​డీఏ అభ్యర్థిని ఓడించేందుకు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యూహాలు పన్నుతున్నారు. ఈ మేరకు ఈనెల 15న దిల్లీలో సమావేశం ఏర్పాటు చేశారు మమత. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు భేటీకి హాజరుకావాలని 22 మంది విపక్ష నేతలు, ముఖ్యమంత్రులకు లేఖ రాశారు మమత. అందులో ముఖ్యమంత్రులు.. అరవింద్​ కేజ్రీవాల్​, పినరయి విజయన్​, నవీన్​ పట్నాయక్​, కేసీఆర్​, ఎంకే స్టాలిన్​, ఉద్ధవ్​ ఠాక్రే, హేమంత్​ సొరెన్​, భగవంత్​ మాన్​లు ఉన్నారు. వారితో పాటు కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సైతం ఆహ్వాన లేఖను పంపించారు మమత. మరో వైపు రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం భావసారూప్య పార్టీలతో చర్చల కోసం రాజ్యసభలో విపక్ష నేత మల్లిఖార్జున ఖర్గేకు సమన్వయ భాద్యతలు అప్పగించారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ.

ఇవీ చదవండి:ఈడీ ముందుకు రాహుల్​.. దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్​ పిలుపు

సోనియా గాంధీకి అస్వస్థత- ఆస్పత్రిలో చేరిక

రాజ్యసభ ఫలితాలతో భాజపాలో జోష్​.. రాష్ట్రపతి ఎన్నికపై ధీమా

Last Updated :Jun 12, 2022, 6:28 PM IST

ABOUT THE AUTHOR

...view details