తెలంగాణ

telangana

'మమతకు గాయం కుట్రే- విచారణ తప్పనిసరి'

By

Published : Mar 12, 2021, 2:39 PM IST

నందిగ్రామ్​లో మమత కాలికి గాయమైన ఘటన గురించి కేంద్ర ఎన్నికల సంఘాన్ని టీఎంసీకి చెందిన ఆరుగురు ఎంపీల బృందం కలిసింది. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది.

Injuries to West Bengal CM Mamata Banerjee in Nandigram not "unfortunate incident" but conspiracy, TMC delegation tells EC in Delhi.
మమతకు గాయం.. ఈసీ వద్దకు టీఎంసీ ఎంపీలు

బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాలికి గాయమైన ఘటన.. అనుకోకుండా జరగలేదని, కుట్రపూరితంగానే జరిగిందని తృణమూల్​ కాంగ్రెస్​ నేతలు(టీఎంసీ) ఆరోపించారు. ఈ మేరకు టీఎంసీకి చెందిన ఆరుగురు ఎంపీల బృందం.. దిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేసింది. దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్​ చేసింది.

"నందిగ్రామ్​లో మమతపై దాడి ఘటనలో ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని మేము డిమాండ్​ చేశాం. ఆమెపై దాడి జరిగినప్పుడు పోలీసులు ఎవరూ లేరు. ఆ ఘటనలు ఆమెను హత్య చేసేందుకు జరిగినట్లుగానే తెలుస్తోంది. కుట్రపూరితంగా దీదీపై దాడికి పాల్పడ్డారు."

-టీఎంసీ నేత, సౌగతా రాయ్​.

నందిగ్రామ్​ ఎన్నికల ప్రచారంలో గాయపడ్డ బంగాల్​ సీఎం మమతా బెనర్జీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఎస్​ఎస్​కేఎమ్ ఆసుపత్రి​ వైద్యులు వెల్లడించారు. చికిత్సకు మమత స్పందిస్తున్నారని, వేగంగా కోలుకుంటున్నారని శుక్రవారం చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details