తెలంగాణ

telangana

దేశంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు

By

Published : Apr 30, 2022, 9:26 AM IST

Corona News: దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కొత్తగా 3688 మందికి పాజిటివ్​గా తేలింది. మరో 50మంది వైరస్​ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

corona news
corona news

Corona Cases In India: దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రితం రోజుతో పోల్చితే స్వల్పంగా పెరిగింది. మరో 3,688 మందికి పాజిటివ్​గా తేలింది. వైరస్ కారణంగా కొత్తగా 50 మంది ప్రాణాలు కోల్పోయారు. 2,755 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4కోట్ల 30లక్షల 76వేలకు సమీపించింది. మరణాల సంఖ్య 5లక్షల 23వేల 800కు పైగా ఉంది. శుక్రవారం 4,96,640 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

  • యాక్టివ్ కేసులు: 18,684
  • మొత్తం మరణాలు: 5,23,803
  • మొత్తం కేసులు: 4,30,75,914
  • రికవరీలు: 4,25,33,377

Vaccination in India: దేశంలో కరోనా టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. శుక్రవారం 22,58,059 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,88,89,90,935కు చేరింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఒక్కరోజు వ్యవధిలో 5,83,044 కొత్త కేసులు నమోదయ్యాయి. మహమ్మారి ధాటికి 2,323 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ కొరియా, జర్మనీ, ఆస్ట్రేలియా, ఇటలీ, ఫ్రాన్స్​ దేశాల్లో కొవిడ్​ ఉద్ధృతి తీవ్రంగా ఉంది.

  • జర్మనీలో 96,523 కొవిడ్​ కేసులు వెలుగుచూశాయి. 186 మంది మృతిచెందారు.
  • అమెరికాలో 62,993 కరోనా కేసులు బయటపడ్డాయి. 263 మంది వైరస్​కు బలయ్యారు.
  • ఇటలీలో 58,861 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 133 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఫ్రాన్స్​​లో తాజాగా 52,919 మంది వైరస్​ సోకింది. మరో 158 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • దక్షిణ కొరియాలో తాజాగా 50,551 కరోనా కేసులు నమోదయ్యాయి. 136 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చదవండి:సరికొత్త ఆవిష్కరణ.. బ్యాక్టీరియా నుంచి బయో సిమెంట్‌

ABOUT THE AUTHOR

...view details