తెలంగాణ

telangana

దేశంలో 1.55 లక్షలు దాటిన కరోనా మరణాలు

By

Published : Feb 8, 2021, 9:49 AM IST

దేశంలో కొత్తగా 11,831 కరోనా కేసులు వెలుగుచూశాయి. మొత్తం బాధితుల సంఖ్య 1కోటి 8లక్షల 38 వేలు దాటింది. వైరస్​ సోకిన వారిలో మరో 11,904 మంది కోలుకున్నారు.

INDIA REGISTERED 11,831 NEW COVID-19 POSTIVE CASES AND 84 DEATHS IN LAST 24 HOURS
దేశంలో 1.55 లక్షలు దాటిన కరోనా మరణాలు

దేశవ్యాప్తంగా క్రితం రోజుతో పోల్చితే కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా 11,831 మంది వైరస్​ బారినపడ్డారు. మహమ్మారి సోకిన వారిలో మరో 84 మంది చనిపోయారు.

  • మొత్తం కేసులు: 1,08,38,194
  • యాక్టివ్ కేసులు: 1,48,609
  • కోలుకున్నవారు: 1,05,34,505
  • మొత్తం మరణాలు: 1,55,080

కొవిడ్​ బారినపడిన వారిలో మరో 11,904 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. దేశవ్యాప్త రికవరీ రేటు 97.20 శాతంగా నమోదవ్వగా.. మరణాల రేటు స్థిరంగా 1.43 శాతంగా ఉంది.

దేశవ్యాప్తంగా.. ఆదివారం ఒక్కరోజే 5లక్షల 32వేల 236 నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్​) తెలిపింది. దీంతో మొత్తం టెస్ట్​ల సంఖ్య 20.19 కోట్లు దాటింది.

దేశీయంగా.. ఇప్పటివరకు సుమారు 58.12 లక్షల మంది లబ్ధిదారులకు టీకా అందించినట్టు స్పష్టం చేసింది ఆరోగ్య శాఖ.

ఇదీ చదవండి:చకచకా అందరికీ అందాలి కరోనా టీకా!

ABOUT THE AUTHOR

...view details