తెలంగాణ

telangana

ఐరాసలో 'తృణధాన్యాల తీర్మానం' ఆమోదంపై మోదీ హర్షం

By

Published : Mar 4, 2021, 9:30 PM IST

తృణధాన్యాల ప్రాచుర్యానికి కృషి చేయడం భారత్​కు గర్వకారణమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో.. 2023ను అంతర్జాతీయ తృణధాన్యాల ఏడాదిగా గుర్తిస్తూ తీర్మానం ఆమోదించడంపై హర్షం వ్యక్తం చేశారు.

PM Modi on popularising millets
'తృణధాన్యాల ప్రాచుర్యానికి కృషిచేయడం భారత్​కు గర్వకారణం'

2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ తృణధాన్యాల ఏడాదిగా గుర్తిస్తూ ఐక్యరాజ్యసమితి సాధారణ సభ తీసుకున్న నిర్ణయంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. భారత్​ ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి మద్దతు పలికిన దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు. భారత్​తోపాటు బంగ్లాదేశ్, కెన్యా, నేపాల్, నైజీరియా, రష్యా దేశాలు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. 70 దేశాలు ఈ తీర్మానాన్ని అంగీకరించాయి.

"తృణధాన్యాల ప్రాచుర్యం పెంచేందుకు భారత్​ కృషి చేయడం మంచి విషయం. వీటి ఉత్పత్తి రైతుల సంక్షేమానికి తోడ్పడుతుంది. వ్యవసాయ శాస్త్రవేత్తలకు, అంకురాలకు ఇది పరిశోధన అవకాశాలు పెంచుతుంది."

-నరేంద్ర మోదీ, ప్రధాని.

భారత్​ తీర్మానానికి మద్దతు పలికిన వారికి మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో పాల్గొన్న అధికారులకు ఇచ్చిన తృణధాన్యాలతో చేసిన 'మురుక్కు' అందరూ రుచి చూడాల్సిన వంటకం అని అన్నారు.

తృణధాన్యాల పోషకాహార, పర్యావరణ ప్రయోజనాలను ప్రపంచానికి అందించే విషయంలో ఈ తీర్మానం ఆమోదం పెద్ద ముందడుగు అని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత రాయబారి ఎస్​ తిరుమూర్తి అన్నారు. సాధారణ సభలో ఈ తీర్మానానికి మద్దతు తెలిపిన దేశాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి:'అసభ్యత పెరిగిపోతోంది..పర్యవేక్షణ అవసరం'

ABOUT THE AUTHOR

...view details