మహారాష్ట్రలో తాజాగా 61,695 కరోనా కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 36,39,855కి చేరింది. మరో 349మంది కరోనాకు బలయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,20,060 యాక్టివ్ కేసులున్నాయి. ఉత్తర్ప్రదేశ్లో తాజాగా 22,439 మందికి కొవిడ్ సోకింది, 104మంది చనిపోయారు. దిల్లీలో 16,699 కరోనా కేసులు నమోదయ్యాయి, 112మంది కరోనాతో మృతి చెందారు.
కరోనా పంజా- మహారాష్ట్రలో 61,695మందికి పాజిటివ్
దేశవ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఆయా రాష్ట్రాల్లో కొత్త కేసులు భారీగా వెలుగుచూస్తున్నాయి. మహారాష్ట్రలో ఒక్కరోజే 61,695 మంది వైరస్ బారిన పడ్డారు. ఉత్తర్ప్రదేశ్లో తాజాగా 22,439 మందికి కొవిడ్ సోకింది.
కరోనా
రాష్ట్రాల వారీగా నమోదైన పాజిటివ్ కేసులు, మరణాలు
రాష్ట్రం | తాజా కేసులు | తాజా మరణాలు |
మధ్యప్రదేశ్ | 10,166 | 53 |
పంజాబ్ | 4,333 | 51 |
రాజస్థాన్ | 6,658 | 33 |
గుజరాత్ | 8,152 | 81 |
హరియాణా | 5,858 | 18 |
బంగాల్ | 6,769 | 22 |
కేరళ | 8,126 | 20 |
తమిళనాడు | 7,987 | 29 |
కర్ణాటక | 14,738 | 66 |