తెలంగాణ

telangana

కరోనా పంజా- మహారాష్ట్రలో 61,695మందికి పాజిటివ్​

By

Published : Apr 15, 2021, 10:40 PM IST

దేశవ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఆయా రాష్ట్రాల్లో కొత్త కేసులు భారీగా వెలుగుచూస్తున్నాయి. మహారాష్ట్రలో ఒక్కరోజే 61,695 మంది వైరస్​ బారిన పడ్డారు. ఉత్తర్​ప్రదేశ్​లో తాజాగా 22,439 మందికి కొవిడ్​ సోకింది.

virus
కరోనా

మహారాష్ట్రలో తాజాగా 61,695 కరోనా కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 36,39,855కి చేరింది. మరో 349మంది కరోనాకు బలయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,20,060 యాక్టివ్​ కేసులున్నాయి. ఉత్తర్​ప్రదేశ్​లో తాజాగా 22,439 మందికి కొవిడ్​ సోకింది, 104మంది చనిపోయారు. దిల్లీలో 16,699 కరోనా కేసులు నమోదయ్యాయి, 112మంది కరోనాతో మృతి చెందారు.

రాష్ట్రాల వారీగా నమోదైన పాజిటివ్​ కేసులు, మరణాలు

రాష్ట్రం తాజా​ కేసులు తాజా మరణాలు
మధ్యప్రదేశ్​ 10,166 53
పంజాబ్​ 4,333 51
రాజస్థాన్​ 6,658 33
గుజరాత్​ 8,152 81
హరియాణా 5,858 18
బంగాల్​ 6,769 22
కేరళ 8,126 20
తమిళనాడు 7,987 29
కర్ణాటక 14,738 66

ఇదీ చదవండి:విజృంభిస్తోన్న కరోనా- మహారాష్ట్రలో 60వేల కేసులు

ABOUT THE AUTHOR

...view details