తెలంగాణ

telangana

నైరుతి రుతుపవనాలు కాస్త ఆలస్యం.. అప్పటి వరకు వర్షాలు కష్టమేనా?

By

Published : May 16, 2023, 3:39 PM IST

Updated : May 16, 2023, 4:37 PM IST

IMD Monsoon start date 2023 : నైరుతి రుతుపవనాలు కేరళలోకి కొంచెం ఆలస్యంగా ప్రవేశిస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) పేర్కొంది. జూన్​ 4వ తేదీకి నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉందని వెల్లడించింది.

imd monsoon
imd monsoon

Monsoon starting in Kerala 2023 : నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది కేరళలోకి కొంచెం ఆలస్యంగా ప్రవేశిస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. జూన్​ 4వ తేదీకి నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉందని వెల్లడించింది. 'ఈ ఏడాది కేరళలోకి నైరుతి రుతుపవనాలు కాస్త ఆలస్యంగా ప్రవేశించే అవకాశం ఉంది. జూన్​ 4నాటికి కేరళలో రుతుపవనాలు ప్రవేశిస్తాయి.' అని ఐఎండీ పేర్కొంది.

సాధారణంగా ఏటా జూన్​ 1న కేరళలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. ఈ ఏడాది మాత్రం కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. 2022లో మే 29న, 2021లో జూన్​ 3న, 2020లో జూన్​ 1న కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. భారత్​లోకి భూభాగంపై తొలుత కేరళలో ప్రవేశిస్తాయి. నైరుతి రుతుపవనాల రాకతో వర్షాలు పడే అవకాశాలు ఉంటాయి. అందుకే నైరుతి రుతుపవనాల రాకకోసం రైతులు ఆశగా ఎదరుచూస్తుంటారు.

ఐఎండీ అంచనా..
IMD Rain Forecast 2023 : 2023లో నైరుతి రుతుపవనాల కారణంగా సాధారణ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ విభాగం- ఐఎండీ అంచనా వేసింది. హిందూ మహాసముద్ర ద్విధ్రువ, ఉత్తర అర్ధగోళంలోని పరిస్థితుల కారణంగా ఎల్‌నినో ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. సీజన్​ ద్వితీయార్థంలో ఈ ప్రభావం కనిపించవచ్చని వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్​లో భారత వాతావరణ శాఖ ఈ వివరాలను తెలియజేసింది. ఈ ఏడాది లోటు వర్షపాతం ఉంటుందని, కరవు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రైవేటు వాతావరణ సంస్థ అయిన స్కైమెట్ వెల్లడించిన మరుసటి రోజే ఐఎండీ ఈ మేరకు ప్రకటన చేసింది.

ఐఎండీ అంచనాల ప్రకారం..

  • భారత్​లోని వాయవ్య, పశ్చిమ, మధ్య, ఈశాన్య ప్రాంతాల్లో సాధారణం నుంచి లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.
  • తూర్పు భారతం, ఈశాన్య, వాయవ్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం ఉంటుంది.
  • వర్షాకాలంలో ఎల్​ నినో పరిస్థితులు ఏర్పడవచ్చు. సీజన్​ ద్వితీయార్థంలో ఈ ప్రభావం కనిపించవచ్చు.

సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం.. 67 శాతం ఉందని ఐఎండీ వాతావరణ శాస్త్ర డైరెక్టర్ జనరల్ ఎం మోహపాత్ర వెల్లడించారు. ఉత్తరార్ధగోళంలో యురేషియాపై హిమపాతం ఉండే ప్రాంతం.. డిసెంబర్ 2022 నుంచి మార్చి 2023 వరకు సాధారణం కంటే తక్కువగా ఉందన్నారు. ఇది భారత్​లో నైరుతి రుతుపవనాల వర్షపాతానికి అనుకూలమైనదిగా పరిగణించవచ్చని ఆయన వివరించారు.

IMD Skymet Weather : రుతుపవనాల వర్షాలపై ఆధారపడి ఎక్కువగా వ్యవసాయం చేసే భారత్​కు.. ఐఎం​డీ అంచనాలు కాస్త ఉపశమనం కలిగించాయి. భారత్​లో జూన్​ నుంచి సెప్టెంబర్​ మధ్య కాలాన్ని నైరుతి రుతుపవనాల కాలంగా పరిగణిస్తారు. అయితే భారత్​లో ఈ ఏడాది లోటు వర్షపాతం నమోదవుతుందని ప్రైవేటు వాతావరణ సంస్థ అయిన స్కైమెట్ ఏప్రిల్​ 10న ప్రకటించింది. కరవు ఏర్పడేందుకు 20శాతం అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. ఇందుకు కాస్త విరుద్ధంగా.. ఈసారి వర్షాలు సాధారణ స్థాయిలో ఉంటాయని ఐఎండీ తెలిపింది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్​ చెయ్యండి.

Last Updated : May 16, 2023, 4:37 PM IST

ABOUT THE AUTHOR

...view details