తెలంగాణ

telangana

ఐఐఎం హాస్టల్ భోజనంలో పురుగులు, ఇనుప తీగలు.. విద్యార్థుల ఆందోళన

By

Published : Nov 8, 2022, 9:54 PM IST

ఐఐఎం కోల్​కతాలోని.. క్యాంపస్ క్యాంటీన్​ భోజనంలో పురుగులు, ఇనుప తీగలు రావడం వివాదాస్పదమైంది. నాణ్యత లేని భోజనాన్ని తమకు పెడుతున్నారని విద్యార్థులు మంగళవారం ఆందోళన చేశారు. ఈ క్రమంలో క్యాంపస్​లో ఉన్న క్యాంటీన్​లన్ని మూతపడ్డాయి.

IIM Calcutta canteen serves substandard food
ఆహారం నాణ్యత లేదని విద్యార్థుల నిరసన

ఐఐఎం కోల్​కతా క్యాంపస్​లోని మెస్​లో ఆహారంలో నాణ్యత లేదని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. క్యాంపస్‌లో ఉన్న నాలుగు క్యాంటీన్లలో ఒక క్యాంటీన్​లో ఆహారం బాగోలేదని అన్నారు. ఆహారంలో పురుగులు, ఇనుప తీగలు వస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి ఘటనలపై యజమాన్యానికి పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. కొద్దిరోజుల క్రితం ఒక మెస్​ను మూసేశారు సిబ్బంది. అలాగే విద్యార్థుల నిరసనలు నేపథ్యంలో మిగిలిన మూడు మెస్​లను మంగళవారం మూసేశారు. మొబైల్ యాప్స్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసినా క్యాంటీన్ సిబ్బంది వారిని క్యాంపస్‌లోకి అనుమతించడం లేదని పేర్కొన్నారు. దీనిపై మంగళవారం ఉదయం నుంచి కళాశాల క్యాంపస్‌లో ఆందోళనలు జరుగుతున్నాయి.

విద్యార్థుల భోజనంలో పురుగు
ఐఐఎం కోల్​కతా మెస్​లో విద్యార్థుల భోజనంలో ఇనుప తీగ

'గత రెండు నెలలుగా క్యాంపస్​లోని మెస్​లోని ఆహారం తిని పలువురు అస్వస్థతకు గురయ్యారు. చాలా మంది విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారు. ఇలా జరగడం వల్ల చాలా మంది విద్యార్థులు క్యాంటీన్​లో తినడం మానేశారు. మొబైల్ యాప్స్ ద్వారా ఫుడ్ ఆర్డర్​ చేసినా క్యాంపస్​లోకి రానివ్వట్లేదు.'
-ఐఐఎం విద్యార్థి

భోజనంలో ఇనుప తీగ
భోజనంలో చీమ
నిరనన తెలుపుతున్న విద్యార్థులు

ABOUT THE AUTHOR

...view details