తెలంగాణ

telangana

లఖ్​నవూ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

By

Published : Apr 17, 2021, 6:17 AM IST

లఖ్​నవూ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారం పెట్టె పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో దీనిని అధికారులు గుర్తించారు. ఇందులో రూ.కోటీ 88 లక్షల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరో ఘటనలో కేరళలో ప్రైవేటు విమాన సిబ్బంది నుంచి 2.5కిలోల బంగారం పౌడర్​ను అధికారులు సీజ్​ చేశారు.

Gold biscuits
బంగారం బిస్కెట్లు

ఉత్తర్​ప్రదేశ్​లోని అదానీ లఖ్​నవూ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం దుబాయ్ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో బంగారం పెట్టె ఒకటి బయటపడింది. దీంట్లో రూ.కోటి 88 లక్షల విలువైన బంగారు బిస్కెట్లను కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. ఈ బంగారం ఎవరిది అన్న కోణంలో విచారణ చేపట్టింది.

పట్టుబడిన బంగారం బిస్కెట్లతో కస్టమ్స్ సింబల్​

దుబాయ్ నుంచి లఖ్​నవూకు చేరుకున్న విమానం లోపల ఒక పెట్టెను విమానాశ్రయ సిబ్బంది కనుగొన్నారు. దీనిలో 3.84 గ్రాముల బరువైన 33 బంగారు బిస్కెట్లున్నాయి.

-డిప్యూటీ కమిషనర్ నిహారికా లఖా

స్వాధీనం చేసుకున్న బంగారం బిస్కెట్లు

స్వాధీనం చేసుకున్న బంగారానికి సంబంధించి ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుల్లో స్మగ్లర్ ఉండొచ్చని.. అయితే కస్టమ్స్ తనిఖీల కారణంగా బంగారాన్ని బయటకు తీయలేకపోయినట్లు భావిస్తున్నారు.

కేరళలో బంగారం పౌడర్..

కేరళ కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్, డిపార్ట్​మెంట్ ఆఫ్​ రెవెన్యూ(డీఆర్​ఐ) ఉమ్మడిగా నిర్వహించిన ఆపరేషన్‌లో రూ.కోటికి పైగా విలువైన 2.5 కిలోల బంగారం పట్టుబడింది. ఓ ప్రైవేట్ విమానయాన సంస్థ సిబ్బంది నుంచి దీన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. నిందితులను స్థానిక కోర్టులో హాజరుపరిచారు.

రస్​-అల్-ఖైమా నుంచి వచ్చిన ఈ విమానంలో పౌడర్​ రూపంలో ఉన్న 2.55 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఇవీ చదవండి:రూ.98 కోట్ల విలువైన డ్రగ్స్​ స్వాధీనం

ABOUT THE AUTHOR

...view details