తెలంగాణ

telangana

దిల్లీలో స్కూళ్లు మూసివేత.. వారం రోజులు లాక్​డౌన్!

By

Published : Nov 13, 2021, 6:35 PM IST

Updated : Nov 13, 2021, 7:11 PM IST

దేశ రాజధాని దిల్లీలో వారం రోజుల పాటు స్కూళ్లు మూసివేస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు(delhi lockdown news). ప్రభుత్వ కార్యాలయాలు కూడా 100 శాతం ఇంటి నుంచే విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు(delhi lockdown news today).

schools of delhi will be closed since monday
schools of delhi will be closed since monday

దిల్లీలో వారం రోజుల పాటు లాక్​డౌన్ తరహా ఆంక్షలు అమల్లోకి రానున్నాయి(delhi lockdown news). సోమవారం నుంచి ఏడు రోజుల పాటు పాఠశాలలు మూసివేయాలని సీఎం కేజ్రీవాల్ ఆదేశించారు. ప్రభుత్వ అధికారులు కూడా ఇళ్ల నుంచి విధులు నిర్వహించాలని తెలిపారు. ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించే విషయాన్ని పరిశీలించన్నారు(delhi lockdown news today). భవన నిర్మాణ కార్యకలాపాలు కూడా నవంబర్​ 14-17 వరకు పూర్తిగా నిషేధిస్తున్నట్లు వెల్లడించారు.

దిల్లీలో వాయుకాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరిన కారణంగా లాక్​డౌన్​ విధించడంపై సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని సుప్రీంకోర్టు చేసిన సూచన మేరకు కేజ్రీవాల్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది(delhi news lockdown ). వాయునాణ్యత సూచి 499కి చేరినందున త్వరితగతిన చర్యలు చేపట్టింది. పాఠశాలలను మూసి వేస్తే పిల్లలు విషవాయువును పీల్చే ముప్పు ఉండదని కేజ్రీవాల్ అన్నారు. అయితే తరగతులను వర్చువల్​గా ఆన్​లైన్​లో నిర్వహించాలన్నారు.

అంతకుముందు దిల్లీలో కాలుష్యంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది(delhi air pollution news today). వాయునాణ్యత అత్యంత తీవ్రస్థాయికి చేరడంపై సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. ఇది అత్యవసర పరిస్ధితిగా అభివర్ణించింది. కాలుష్యం కట్టడికి ఈ నెల 15న అత్యవసర ప్రణాళికతో తమ ముందు హాజరుకావాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్​వీ రమణ కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. కేంద్రం తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా పంజాబ్‌లో రైతులు పంట వ్యర్ధాలను కాల్చడం వల్లే కాలుష్యం పెరుగుతోందని వివరించగా.. జస్టిస్‌ ఎన్​వీ రమణ అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతులపై మాత్రమే నెపం మోపడం సరికాదని, మిగతా వాటి పరిస్ధితి ఏమిటని ప్రశ్నించారు.

అనంతరం ఈ విషయంపై కేజ్రీవాల్ ​ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. కాలుష్య కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు(delhi lockdown pollution). నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. దిల్లీలో పూర్తిస్థాయి లాక్​డౌన్(delhi lockdown) విధించే ప్రతిపాదనను సుప్రీంకోర్టుకు సమర్పిస్తామన్నారు.

విష వాయువు...

వాహన కాలుష్యం, పంట వ్యర్ధాల దహనంతో దేశ రాజధాని దిల్లీ, దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో గత కొంత కాలంగా క్షీణించిన వాయు నాణ్యత మరింత ప్రమాదకర స్ధాయికి చేరింది(delhi air pollution news). దిల్లీలో వాయు నాణ్యత సూచీ 473గా నమోదైంది. దిల్లీ చుట్టుపక్కల ఉన్న నోయిడాలో ఇది 587గా నమోదు కాగా, గురుగ్రామ్‌లో 557గా నమోదైంది. వాయు నాణ్యత సూచీ సున్నా నుంచి 50 మధ్య నమోదైతే గాలి నాణ్యంగా ఉన్నట్లు, 401 నుంచి 500 ఉంటే పరిస్ధితి తీవ్రంగా ఉన్నట్లు పరిగణిస్తారు. వాయు నాణ్యత చాలా క్షీణించిన నేపథ్యంలో దిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతంలో ప్రజలు బహిరంగ కార్యక్రమాలను పరిమితం చేసుకోవాలని, ప్రభుత్వ, ప్రైవేటు సంస్ధలు తమ వాహనాల వినియోగాన్ని కనీసం 30శాతం తగ్గించుకోవాలని అధికారులు సూచించారు.

ఇదీ చదవండి:అసోం రైఫిల్స్ కాన్వాయ్​పై ఉగ్రదాడి- ఏడుగురు మృతి

Last Updated :Nov 13, 2021, 7:11 PM IST

ABOUT THE AUTHOR

...view details