తెలంగాణ

telangana

శివలింగ అభిషేక జలం కోసం కాలినడకన 35కి.మీ

By

Published : Mar 12, 2021, 11:48 AM IST

సాధారణంగా దగ్గర్లోని నదీ జలాలతో గుడిలోని విగ్రహాన్ని అభిషేకిస్తారు భక్తులు. కానీ కర్ణాటకలోని ఓ గ్రామ ప్రజలు మాత్రం ఏకంగా 35 కిలోమీటర్ల దూరం నడచి అభిషేక జలాన్ని తీసుకురావడం అనవాయితీగా వస్తోంది. శివరాత్రి రోజున ఈ తంతు మొత్తం పురుషులే నిర్వహించడం అక్కడి ఆచారం.

Five men walk 35km to bring water for Abhishekam (anoint) of lingam
శివలింగ అభిషేక నీటి కోసం 35కిమీ కాలినడక..

కర్ణాటకలోని చామరాజనగర్​లో సిద్ధరామేశ్వర ఆలయంలోని శివలింగానికి.. నంజన్​గఢ్​ తాలూకా ఆనమ్​బల్లి గ్రామ సమీపంలోని కపిల నది నీటితో అభిషేకం నిర్వహించడం సంప్రదాయం. ఈ జలం కోసం ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 35 కిలోమీటర్ల దూరం నడిచి వెళతారు ఈ భక్తులు. అభిషేకించిన ఆ నీటిని గ్రామంలోని ఇళ్లల్లో తీర్థ ప్రసాదంగానూ పంచుతామని గ్రామస్థులు తెలిపారు. ప్రతి ఏడాది శివరాత్రిని పురస్కరించుకొని ఇలా చేయడం ఆచారంగా వస్తోందని వెల్లడించారు.

శివలింగ అభిషేకం కోసం 35కిమీ కాలినడకన వెళ్లి నీటిని సేకరిస్తోన్న పురుషులు

''ఈ ఆచారం తరతరాలుగా వస్తోంది. మేమూ పాటిస్తున్నాం. సిద్ధరామేశ్వర శివలింగానికి పూజలు చేసేందుకు కపిల నది నుంచి నీటిని తీసుకొస్తాం. దీనికోసం చెప్పులు లేకుండా నడుస్తూ వెళ్లడం మా ఆచారం.''

- శివ మల్లప్ప

ఇదీ చదవండి:మే 17 నుంచి కేదార్‌నాథ్‌ దర్శనం

ABOUT THE AUTHOR

...view details