తెలంగాణ

telangana

పార్కింగ్ ప్రదేశంలో 20 కార్లు దగ్ధం.. స్కూల్​ బస్సులో మంటలు.. 19 మంది..

By

Published : Dec 26, 2022, 9:06 PM IST

బహుళ అంతస్తు పార్కింగ్ సముదాయంలో ఓ యువకుడు కారుకు నిప్పంటించాడు. దీంతో ఆ పార్కింగ్ సముదాయంలో ఉన్న 20 కార్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటన దిల్లీలో జరిగింది. మరోవైపు, ప్రైవేట్ స్కూల్ బస్సులో మంటలు చెలరేగిన ఘటన గుజరాత్​లో జరిగింది. అగ్నిమాపక దళాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి.

fire accident in delhi
అగ్ని ప్రమాదం

పశ్చిమ దిల్లీ.. సుభాష్​నగర్​లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. బహుళ అంతస్తుల పార్కింగ్ సముదాయంలోని కారుకు నిప్పు పెట్టాడు ఓ యువకుడు. దీంతో మంటలు వ్యాపించి పార్కింగ్​ సముదాయంలో ఉన్న 20 కార్లు దగ్ధమయ్యాయి. సోమవారం వేకువజామున జరిగిందీ ఘటన. ఈ ఘటనపై పోలీసులకు వాహన యజమాని ఫిర్యాదు చేశాడు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడు యశ్ అరోరా(23)ను పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
వాహన యజమానిపై కోపంతో యువకుడు అతడి ఎర్టిగా కారుకు నిప్పంటించాడు. ఈ క్రమంలో 20 కార్లకు నిప్పంటుకుని దగ్ధమయ్యాయి. ఏడు ఫైర్ ఇంజిన్లు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు.

స్కూల్ బస్సులో మంటలు..
గుజరాత్ సూరత్​లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ స్కూల్ బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్​ ప్రయాణికులను కిందకు దింపాడు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక దళాలు మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ బస్సులో ఉద్యోగులు, చిన్నారులు సహా 19 మంది ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని పేర్కొన్నారు. అయితే మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంకా తెలియలేదని పేర్కొన్నారు.

స్కూల్ బస్సులో చెలరేగిన మంటలు
మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక దళాలు

ABOUT THE AUTHOR

...view details