తెలంగాణ

telangana

పాపం.. చికిత్స కోసం భార్యను భుజాలపై మోసుకెళ్లినా...

By

Published : Sep 10, 2021, 12:01 PM IST

Elderly woman going for treatment dies

తీవ్ర అనారోగ్యానికి గురైన తన భార్యను ఎలాగోలా బతికించుకోవాలనుకున్నాడా వృద్ధుడు. కొండచరియలు విరిగిపడటం వల్ల అంబులెన్స్​ వెళ్లే దారి మూతపడింది. భుజాలపైన మోసుకెళ్లినప్పటికీ ఫలితం లేకపోయింది. మార్గమధ్యంలోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన మహారాష్ట్రలో జరిగింది. అధికారుల నిర్లక్ష్యమే మృతికి కారణమని స్థానికులు మండిపడుతున్నారు.

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను చికిత్స కోసం ఓ వృద్ధుడు ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యాడు. భారీ వర్షాల ధాటికి.. కొండచరియలు విరిగిపడటం వల్ల అంబులెన్స్​ వెళ్లే దారి మూసుకుపోయింది. దీంతో చేసేదేంలేక ఆమెను ఎలాగైనా బతికించుకోవాలనుకున్న ఆ భర్త.. సిద్లీబాయీని భుజానికెత్తుకుని ఆసుపత్రికి నడక ప్రారంభించాడు.

అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను మోసుకెళ్తున్న వృద్ధుడు

దురదృష్టవశాత్తు ఆమె ఆసుపత్రి చేరకుండానే మృతిచెందింది. అప్పటికే పరిస్థితి విషమించడం వల్ల సిద్లీబాయీ.. అతని భుజాలపైనే ప్రాణాలు కోల్పోయింది. మహారాష్ట్రలోని నందుర్బార్​ జిల్లా చాంద్​సేలీ ఘాట్​లో ఈ విషాదకర ఘటన జరిగింది.

కొండచరియలు విరిగిపడి మూసుకుపోయిన దారి
భార్య మృతదేహంతో వృద్ధుడు

''కొండచరియలు విరిగిపడటం వల్ల.. అంబులెన్స్​ వెళ్లలేకపోయింది. ఆమెను సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్లలేకపోయారు.''

- మహేశ్​ పాటిల్​, సబ్​ డివిజనల్​ మేజిస్ట్రేట్

ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం తమకు ఇదే సమస్య తలెత్తుతోందని.. వర్షాల కారణంగా కొండచరియలు పడి రహదారులు మూసుకుపోతున్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

ఇవీ చూడండి: ప్రాణాలు పోసే చేతులే.. ఉసురు తీసుకుంటున్న దైన్యం

మళ్లీ బతికొస్తాడని గంటలపాటు బురదలోనే మృతదేహం!

ABOUT THE AUTHOR

...view details