తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను చికిత్స కోసం ఓ వృద్ధుడు ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యాడు. భారీ వర్షాల ధాటికి.. కొండచరియలు విరిగిపడటం వల్ల అంబులెన్స్ వెళ్లే దారి మూసుకుపోయింది. దీంతో చేసేదేంలేక ఆమెను ఎలాగైనా బతికించుకోవాలనుకున్న ఆ భర్త.. సిద్లీబాయీని భుజానికెత్తుకుని ఆసుపత్రికి నడక ప్రారంభించాడు.
దురదృష్టవశాత్తు ఆమె ఆసుపత్రి చేరకుండానే మృతిచెందింది. అప్పటికే పరిస్థితి విషమించడం వల్ల సిద్లీబాయీ.. అతని భుజాలపైనే ప్రాణాలు కోల్పోయింది. మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లా చాంద్సేలీ ఘాట్లో ఈ విషాదకర ఘటన జరిగింది.
''కొండచరియలు విరిగిపడటం వల్ల.. అంబులెన్స్ వెళ్లలేకపోయింది. ఆమెను సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్లలేకపోయారు.''