తెలంగాణ

telangana

కేంద్ర ఆరోగ్య శాఖతో ఈసీ భేటీ- ఎన్నికల నిర్వహణపై చర్చ!

By

Published : Jan 6, 2022, 12:41 PM IST

EC meeting health ministry: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఎన్నికల సంఘం(ఈసీ) భేటీ అయింది. ఈ ఏడాది ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు.. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

EC meeting health ministry
కేంద్ర ఆరోగ్య శాఖతో ఈసీ భేటీ

EC meeting health ministry: కేంద్ర ఆరోగ్య శాఖతో ఎన్నికల సంఘం(ఈసీ) సమావేశమైంది. ఈ ఏడాది ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలను సమీక్షించేందుకు ఎన్నికస సంఘం అధికారులు- ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ భేటీ అయినట్లు తెలుస్తోంది. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించాలా? వాయిదా వేయాలా? అనే అంశంపై కూడా వారు చర్చించే అవకాశం ఉంది.

ఈసీ కార్యాలయానికి చేరుకున్న కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్​ భూషణ్​
ఈసీ కార్యాయలయానికి కారులో చేరుకున్న రాజేశ్​ భూషణ్​
ఈసీ కార్యాలయం వద్ద కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్​ భూషణ్​

Covid in poll-bound states: ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తర్​ప్రదేశ్​, గోవా, ఉత్తరాఖండ్​, పంజాబ్​, మణిపుర్ రాష్ట్రాల్లోని కొవిడ్ పరిస్థితులను ఈసీకి రాజేశ్ భూషణ్​ వివరించడం ఇది రెండోసారి. అంతకుముందు డిసెంబరు 27న జరిగిన భేటీలో కరోనా పరిస్థితులను ఈసీకి ఆయన వివరించారు. ఆ సమయంలో... ఆయా రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్​ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని ఈసీ ఆదేశించింది.

మరికొన్ని రోజుల్లోనే ... ఐదు రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించే అవకాశం ఉంది.

ఇదీ చూడండి:'ఒమిక్రాన్​ వేళ ఎన్నికలెలా?'.. ఆరోగ్య శాఖతో ఈసీ విస్తృత చర్చ

ABOUT THE AUTHOR

...view details