తెలంగాణ

telangana

'ద్రౌపది గెలిచే అవకాశం'.. మమత జోస్యం.. దీదీపై కాంగ్రెస్​ ఫైర్

By

Published : Jul 1, 2022, 6:55 PM IST

Updated : Jul 1, 2022, 7:52 PM IST

Draupadi Murmu Is More Likely To Win in presidential elections says Mamata banerjee
Draupadi Murmu Is More Likely To Win in presidential elections says Mamata banerjee

Mamata Banerjee on Murmu: రాష్ట్రపతి ఎన్నికలపై బంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్​ అధినేత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ద్రౌపది ముర్మూకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషించారు. భాజపా అడిగి ఉంటే.. ఆమెకే విపక్షాలు కూడా మద్దతు ఇచ్చి ఉండేవని అన్నారు.

Mamata Banerjee on Murmu: రాష్ట్రపతి ఎన్నికలపై బంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఆమెపై కాంగ్రెస్​ నేతలు విమర్శలు గుప్పించేందుకు కారణమయ్యాయి.

మమత ఏమన్నారు?:
"మహారాష్ట్రలో మారిన రాజకీయ పరిస్థితుల్ని బట్టి చూస్తే.. ప్రస్తుతం ద్రౌపది ముర్మూకు విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయి. అభ్యర్థిని ప్రకటించడానికి ముందు భాజపా మాతో చర్చించి ఉంటే.. విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ద్రౌపదికి మద్దతిచ్చే అంశాన్ని పరిశీలించే వాళ్లం. అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో ఒకే అభ్యర్థిని ఎంచుకోవడమే దేశానికి మంచిది.
మేము కూడా మహిళా అభ్యర్థిని నిలిపేందుకు ప్రయత్నించేవాళ్లం. 16-17 రాజకీయ పార్టీలు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాయి. నేను ఒంటరిగా నిర్ణయం తీసుకోలేను. రాష్ట్రపతి ఎన్నికలు శాంతియుతంగా జరగాలని కోరుకుంటున్నా. అన్ని మతాలు, జాతులను సమానంగా గౌరవిస్తా. ఇప్పుడు పోటీ జరుగుతున్నందుకు నాకు బాధగా ఉంది. కానీ.. దళితులు, గిరిజనులు అంతా మాకు అండగా ఉన్నారని నమ్ముతున్నా. ప్రజల మధ్య చీలికలు తేవాలని మేము కోరుకోవడం లేదు" అని కోల్​కతాలో రథయాత్ర కార్యక్రమం సందర్భంగా విలేకర్లతో చెప్పారు మమతా బెనర్జీ. విపక్షాల ఉమ్మడి నిర్ణయం ఆధారంగానే తాను ముందుకెళ్తానని స్పష్టం చేశారు.

కాంగ్రెస్​ మండిపాటు..మమతా బెనర్జీ వ్యాఖ్యలపై కాంగ్రెస్​ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. "ఆమె మోదీతో రహస్య ఒప్పందం చేసుకుని.. మరోసారి అసలు రంగు బయటపెట్టుకున్నారు. రాష్ట్రపతి అభ్యర్థిని మమతనే ఎంపిక చేశారు. మేము మద్దతు ఇచ్చాం. దీదీ ఇప్పుడు భాజపా ఏజెంట్​లా ప్రవర్తిస్తున్నారు. గెలిచేందుకు అవసరమైన సంఖ్యా బలం ఉందని నిర్ధరించుకున్నాకే భాజపా.. ద్రౌపది ముర్మూను అభ్యర్థిగా చేసుకుని ఎన్నికల బరిలో దిగింది. ద్రౌపది గెలుస్తారనడం.. ఏదో కొత్తగా కనుగొన్న విషయం కాదు" అని అన్నారు కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి.
ఆదివాసి అయిన ద్రౌపది ముర్మును రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థిగా ప్రకటించింది ఎన్​డీఏ. ఆ కూటమిలో లేని అనేక పార్టీలు ఇప్పటికే ఆమెకు మద్దతు ప్రకటించాయి. ద్రౌపదికి పోటీగా ఉమ్మడి అభ్యర్థిని నిలిపే విషయంలో తీవ్రస్థాయిలో తర్జనభర్జన పడిన విపక్షాలు.. చివరకు యశ్వంత్ సిన్హాను బరిలోకి దింపాయి.

ఇవీ చూడండి:నుపుర్​ శర్మపై సుప్రీం ఫైర్.. 'దేశానికి క్షమాపణ చెప్పాల్సిందే!'

'ముర్ము' స్వగ్రామానికి కరెంట్.. ఏళ్లుగా పడుతున్న బాధలకు మోక్షం​!

Last Updated :Jul 1, 2022, 7:52 PM IST

ABOUT THE AUTHOR

...view details