Delhi Police Corona: దిల్లీలో జనవరి 1 నుంచి ఇప్పటివరకు 2,500 మంది పోలీసులకు కొవిడ్ సోకింది. వారిలో 767 మంది కోలుకున్నారని అధికారులు తెలిపారు. బాధితుల్లో అన్ని ర్యాంకులకు చెందిన ఆఫీసర్లు ఉన్నారని స్పష్టం చేశారు.
అయితే వైరస్ బారిన పడిన సిబ్బంది.. కోలుకుని తమ విధుల్లో తిరిగి చేరుతున్నారని ఇటీవల కరోనాను జయించిన దిల్లీ పోలీసు ప్రతినిధి, అదనపు పోలీసు కమిషనర్(క్రైమ్ బ్రాంచ్) చిన్మోయి బిశ్వాల్ తెలిపారు. అర్హులైన సిబ్బందికి బూస్టర్ డోసు వేసేందుకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు వ్యాక్సినేషన్ పూర్తికాని తమ కుటుంబ సభ్యులను టీకా తీసుకునే దిశగా ప్రొత్సహించాలని సూచించారు.