తెలంగాణ

telangana

కర్ణాటక, మహాలో 14వేలకు దిగొచ్చిన కేసులు

By

Published : Jun 1, 2021, 9:59 PM IST

దేశవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసుల సంఖ్య మరింత తగ్గింది. తమిళనాడులో 26వేల కేసులు వెలుగుచూడగా, కర్ణాటక, మహారాష్ట్రల్లో 14వేలకు దిగొచ్చాయి. రికవరీల సంఖ్య కూడా బాగా పెరిగింది.

corona cases
కరోనా కేసులు

దేశంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. తమిళనాడులో కొత్తగా 26,513 కేసులు నమోదయ్యాయి. 490మంది ప్రాణాలు కోల్పోయారు. 31,673 మంది డిశ్చార్జ్ అయ్యారు.

దేశ రాజధాని దిల్లీలో కొత్తగా 623 కేసులు వెలుగులోకి వచ్చాయి. 62మంది మరణించారు.

వివిధ రాష్ట్రాల్లో ఇలా..

  • మహారాష్ట్రలో 14,143 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. 477 మంది చనిపోయారు.
  • కేరళలో 19,760 కేసులు నమోదయ్యాయి. 194 మంది మృతి చెందారు.
  • కర్ణాటకలో 14,304 కేసులు బయటపడ్డాయి. 464 మంది మరణించారు.
  • బంగాల్​లో 9,424 కేసులు వెలుగుచూశాయి. 137 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • హరియాణాలో 1,233 మందికి పాజిటివ్​ వచ్చింది. 80 మంది చనిపోయారు.

వ్యాక్సినేషన్..

ఇప్పటివరకు దేశంలో 21.83 కోట్ల వాక్సిన్​ డోసుల పంపిణీ జరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇదీ చూడండి:పిల్లలపై కరోనా ప్రభావం- రెండు విధాలుగా!

ABOUT THE AUTHOR

...view details