తెలంగాణ

telangana

వరద నీటిలోనే చెన్నై సిటీ- రాజ్​నాథ్ ఏరియల్ సర్వే- కేంద్రం రూ.450కోట్ల సాయం!

By PTI

Published : Dec 7, 2023, 4:20 PM IST

Chennai Floods Update : తమిళనాడు రాజధాని చెన్నై సహా పరిసర ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. వరద నీటిలో చిక్కుకున్న వారిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు, రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్​తో ఉన్నతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు.

Chennai Floods Update
Chennai Floods Update

Chennai Floods Update : మిగ్‌జాం తుపాను ప్రభావంతో తమిళనాడులోని చెన్నైతోపాటు శివారు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. వర్షం తగ్గినా ఇంకా చాలా చోట్ల వరద ప్రభావం కొనసాగుతోంది. చెన్నై గుబేరన్ నగర్​లోని మడిపాక్కం ప్రాంతంలో చాలా వరకు ఇళ్లు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. అందుకు సంబంధించిన డ్రోన్ విజువల్స్​ ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. వరద నీటిలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పలుచోట్ల సహాయక సామగ్రిని హెలికాప్టర్ల ద్వారా జారవిడుస్తున్నారు.

నగరంలోని పల్లికరణై ప్రాంతం చెరువును తలపిస్తోంది. అక్కడ ఇళ్లు, పలు పెట్రోల్ పంపులు వరదలో చిక్కుకుని ఉన్నాయి. చెన్నైలోని జెరూసలేం ఇంజినీరింగ్ కళాశాల జల దిగ్బంధంలోనే ఉంది. ఉత్తర చెన్నైలోని మనాలి ప్రాంతంలో వరద ప్రభావం కాసింత ఎక్కువగానే ఉంది. అక్కడి ప్రజలకు తాగునీరు, 12వేల లీటర్ల పాలు, పాల పొడి, దుప్పట్లు, ఆహారం అందించినట్లు అధికారులు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఒకటైన అనకపుత్తూర్‌ను సీఎం ఎంకే స్టాలిన్‌ సందర్శించారు. వరద బాధితులకు ఆహార పొట్లాలు అందించారు.

ఏరియల్ సర్వే నిర్వహించిన రాజ్​నాథ్ సింగ్
మరోవైపు, కేంద్ర రక్షణ శాఖ రాజ్‌నాథ్‌ సింగ్‌ చెన్నైలోని వరద ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్​తో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో మిగ్‌జాం తుపాను వల్ల సంభవించిన నష్టం, కేంద్రం నుంచి అవసరమైన సాయం గురించి రాజ్​నాథ్​కు స్టాలిన్ వివరించారు.

రూ.450 కోట్ల సాయం
మిగ్‌జాం తుపాను వల్ల తీవ్రంగా దెబ్బతిన్న తమిళనాడుకు రెండో విడత సాయంగా రూ.450 కోట్లు విడుదల చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోం శాఖను ఆదేశించారని రాజ్​నాథ్ సింగ్ తెలిపారు. వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో ప్రాణ నష్టం జరగడం పట్ల ప్రధాని మోదీ కలవరపడుతున్నారని పేర్కొన్నారు. 'తమిళనాడులో సహాయక చర్యల్లో ఎన్​డీఆర్ఎఫ్​తో సహా అన్ని కేంద్ర బలగాలు తమ వంతు కృషి చేస్తున్నాయి. రాష్ట్రంలో పరిస్థితిని పర్యవేక్షించవల్సిందిగా ప్రధాని మోదీ నన్ను ఆదేశించారు. తమిళనాడు సీఎం స్టాలిన్​తో వరద పరిస్థితులపై ప్రధాని ఫోన్​లో మాట్లాడారు' అని రాజ్​నాథ్ సింగ్ తెలిపారు.

ప్లాస్టిక్ వ్యర్థాలతో టైల్స్- 500ఏళ్ల వరకు నో డ్యామేజ్- ధర కూడా తక్కువే!

ఒక్కసారిగా కూలిన పాత భవనం పైకప్పు - ముగ్గురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం

ABOUT THE AUTHOR

...view details