తెలంగాణ

telangana

YS Avinash Reddy: ఆ రోజు ఎవరెవరితో మాట్లాడారు.. అవినాష్ రెడ్డిని ప్రశ్నించిన సీబీఐ...

By

Published : Jun 3, 2023, 10:04 PM IST

YS Viveka murder case: వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదురుకుంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఉదయం 9గంటల 40 నిమిషాలకు సీబీఐ కార్యాలయంలోకి వెళ్లిన అవినాష్ తిరిగి సాయంత్రం 5 గంటల సమయంలో బయటకు వచ్చాడు. దాదాపు 7 గంటల పాటు అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. వివేకా హత్య జరిగిన రోజు అర్ధరాత్రి ఎవరెవరితో మాట్లాడారనే విషయాలను సీబీఐ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం.

YS Viveka murder case
YS Viveka murder case

YS Avinash Reddy appears before CBI: వివేకా హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. వివేకా హత్య కేసులోఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఎట్టకేలకు సీబీఐ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. నేడు ఉదయం 9గంటల 40 నిమిషాల సమయంలో తన న్యాయవాదులతో కలిసి సీబీఐ కార్యాలయానికి అవినాష్ రెడ్డి వెళ్లారు. పదిన్నర గంటల సమయంలో సీబీఐ అధికారులు కార్యాలయానికి వచ్చారు. సాయంత్రం 5 గంటల సమయంలో విచారణ ముగియడంతో... అవినాష్ రెడ్డి తిరిగి కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. దాదాపు 7 గంటల పాటు అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. జూన్ 30వ తేదీ వరకూ... ప్రతి శనివారం సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు అవినాష్ రెడ్డి సీబీఐ కార్యాలయానికి వచ్చారు. వైఎస్ వివేకా హత్యకు సంబంధించి సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డిని ప్రశ్నించారు. హత్య జరిగిన రోజు అర్ధరాత్రి ఎవరెవరితో మాట్లాడారనే విషయాలను సీబీఐ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం.

Avinash CBI Enquiry: సీబీఐ విచారణకు హాజరైన కడప ఎంపీ అవినాష్​ రెడ్డి..

ప్రత్యేక కేటగిరీ విచారణ ఖైదీ భాస్కర్‌రెడ్డి: ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డిని ప్రత్యేక కేటగిరీ విచారణ ఖైదీగా పరిగణించేందుకు సీబీఐ కోర్టు అంగీకరించింది. భాస్కర్‌రెడ్డికి ప్రత్యేక కేటగిరీ కల్పించాలని హైదరాబాద్ జిల్లా మేజిస్ట్రేట్‌కు సీబీఐ న్యాయస్థానం సిఫార్సు చేసింది. వివేకా హత్య కేసులో సీబీఐ అరెస్టు చేసిన భాస్కర్‌రెడ్డి గత నెల 16 నుంచి చంచల్‌గూడ జైళ్లో ఉన్నారు. తన వయసు, అనారోగ్యం, సామాజిక స్థితి తదితర విషయాలను పరిగణనలోకి తీసుకొని ప్రత్యేక కేటగిరీ కల్పించాలని భాస్కర్‌ రెడ్డి కోరారు. మరోవైపు భాస్కర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై కౌంటరు దాఖలు చేయాలని సీబీఐని కోర్టు ఆదేశిస్తూ.. విచారణను ఈనెల 5కి వాయిదా వేసింది.

Anticipatory Bail to MP Avinash: అవినాష్‌రెడ్డికి ముందస్తు బెయిల్.. మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు.. కానీ

లేఖపై నిన్‌హైడ్రిన్ ఫోరెన్సిక్ పరీక్ష: మరణించే ముందు వివేకానంద రెడ్డి రాసిన లేఖపై నిన్‌హైడ్రిన్ ఫోరెన్సిక్ పరీక్ష నిర్వహించాలన్న సీబీఐ ప్రయత్నంపై నిందితులు అభ్యంతరం తెలిపారు. సీబీఐ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ గంగిరెడ్డి, సునీల్ యాదవ్ కౌంటర్లు దాఖలు చేశారు. అభ్యంతరం వ్యక్తం చేస్తూ శివశంకర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి వాదనలు వినిపించారు. తన నుంచి ఎలాంటి కౌంటరు లేదని అప్రూవర్ దస్తగిరి తెలిపారు. సీబీఐ తరఫున వాదనల కోసం పిటిషన్‌ను ఈనెల 5కి న్యాయస్థానం వాయిదా వేసింది. వివేకా హత్య కేసు ట్రయల్‌లో సీబీఐ పీపీకి సహకరించేందుకు తనకు అనుమతివ్వాలన్న సునీత పిటిషన్‌పై కూడా నిందితులు అభ్యంతరం తెలిపారు. గంగిరెడ్డి, సునీల్ యాదవ్ కౌంటర్లు దాఖలు చేయగా.. శివశంకర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి వాదనలు వినిపించారు. భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి కౌంటర్లు దాఖలు చేయలేదు. పిటిషన్‌పై వాదనలు వినిపించాలని సునీతను ఆదేశించిన కోర్టు విచారణను ఈనెల 5కి వాయిదా వేసింది.

గతంలో క్యాన్సర్​ బారినపడ్డ చిరంజీవి?.. క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్​!

ABOUT THE AUTHOR

...view details